పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిజకళత్రద్రోహి నిర్దయాత్ముఁ గిరాతు మనుపఁడే నిర్ణిద్రమైత్రిపత్రి
శత్రుసోదరు విభీషణు సమిద్భీషణు రక్షింపఁడే తొల్లి రాఘవుండు


తే.

సకలదిక్కామినీకుచస్తబకములకుఁ, దారహారకలాపమై తద్యశంబు
నేఁడు నాఁడును నున్నది నిత్య మగుచుఁ, గంటె శరణార్థిగి మనుచుటకంటె శుభము.

242


సీ.

అని వక్రనాసుఁ డిట్లాడుమాటలు విని యందఱ వేర్వేర నడుపబుద్ధి
నపుడు దివాభీతనృపతి వికారకర్ణునిఁ జూచి తోఁచిన ట్లనఘ నీవు
పోలినతెఱఁగుఁ జెప్పుదుగాక యనునంత నెడసొచ్చి రక్తాక్షుఁ డిట్టులనియె
నేకార్య మెఱుఁగుదు రిందఱు పలుగూఁత లఱచెద రవివేకి వగుటఁ జేసి


తే.

మంత్రులకు నైజములు మృదుమధురఫణితు, లవి యథార్థీకరించి వాయసముఁ బెంచి
యేల చెడిపోయెదవు సేన నేల చెఱిచె, దహితు నిర్జింపు నాబుద్ధి నాదరింపు.

243


క.

నేరము ప్రత్యక్షంబై, చేరువ నుండంగ సంతసిల్లి సజారన్
చార న్సాధూక్తుల రథ, కారుఁడు శిరసావహించుకథ యిది యయ్యెన్.

244


క.

అన విని యరిమర్దనుఁ డా, యన నాలోకించి యోనయార్ణన యిది యె
ట్లను రాగంబునఁ జెపుమా, వినియెద నన నతఁ డులూకవిభునకు ననియెన్.

245


క.

కేరళదేశంబున రథ, కారప్రమదామతల్లి గల దవ్వికచాం
భోరుహముఖి యువజారో, దారవృషంబులకు వల్లెత్రాడై మెఱయున్.

246


ఉ.

జారులకొంగుపుత్తడి యసభ్యులచేరువపంట మన్మథ
ప్రేరితకోటి కేడుగడ పెన్నిధి గాముకజాతికిం బర
ద్వారులపట్టుగొమ్మ యుపవల్లభసంపద పాంథబృందమం
దారము పల్లవాంగణనిధానము దానివిలాస మారయన్.

247


ఉ.

క్రొవ్వినచన్నుదోయికులుకు న్నునుబయ్యెదఁ దెల్పఁజూచిన
న్రువ్వునఁ బర్వుచూపులదరు ల్చెదరం బటుపాంథమర్మముల్
ద్రవ్వ మెఱుంగుమేనిచెలువం బెడఁజేయక చూడఁ గోడెకాం
డ్రువ్విళులూఱ నూర మెఱయు న్రథకారవధూటి నీటునన్.

248


చ.

మెఱుఁగులఁ గ్రుమ్మరించుకనుమించులు త్రొక్కనిచోట్లు ద్రొక్కఁ గ్రి
క్కిఱిసినగుబ్బచన్ను లెడయీక విరోధులజోక నొండొక
ళ్లొఱయ నితంబబింబమున నొక్కొకయించుక జాఱఁగట్టుఁ గ
ట్టొఱపు ఘటింప నేగునలయుగ్మలి దూరుపుటేటినీటికిన్.

249


శా.

ఆవృత్తస్తని రూపలక్ష్మి కనువిందై యుండ నిర్గ్రాహమో
హావేశక్షుభితుండు గానినరుఁ డిష్టాహారసంచారని