పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిష్కంబు లిరువురు నెఱయ విభాగించు
                కొని తమయిండ్ల కింపొనరఁ బోయి
ప్రకటితస్నేహసంపదఁ బొంది యిరువురు
                తొలఁగక మెలఁగంగ దుష్టబుద్ధి


తే.

తనదుచిత్తంబునందుఁ దద్ధనముఁ దాన
యపహరించిన నంతయు నబ్బు ననుచుఁ
దలఁచి యొక్కనాఁ డొంటిగాఁ దాన యరిగి
పేర్చి యాబిందె వేగంబె పెల్లగించి.

507


క.

కొనితెచ్చి యతిరహస్యం
బున నొకచోఁ బాఁతి దుష్టబుద్ధి సుబుద్ధిం
గని పలికె నాఁడు దాచిన
ధన మిండ్లకుఁ దేక మనకుఁ దడయఁగ నేలా.

508


క.

అతిధార్మికుండు నరపతి
చతురుఁడు మంత్రియును బ్రజలు సజ్జను లగుటన్
మతిఁ దలఁక నేల మన కిది
సతముగఁ జేకూడెఁ బసిఁడి సర్వము ననుచున్.

509


వ.

పలుక వైశ్యకుమారు లిరువురుఁ జని తరుమూలంబున నిడిన
నిక్షేపంబు పుచ్చుకొనుటకుం గ్రొచ్చి చూచి యప్పు డచ్చోటఁ
బసిండి గొనిపోయినతద్ఘాతం బుపలక్షించి యొండొరుల
మీఁద నవిశ్వాసంబు నొంది వివాదంబు సేయుచు నప్పురంబు
మహీశ్వరుసమ్ముఖంబునకుం జని యత్తెఱం గెఱింగింప నతం
డును ధర్మాధికారులఁ దీర్ప నియోగింప వారలను బంచదిన
పర్యంతంబు మీలోనం దెలిసి రం డని యనిపినం జని షష్ఠ
దివసంబునఁ బ్రభాతంబున నయ్యిరువురం బొడచూపి నిలిచి
కప్పుడు దుష్టబుద్ధి ధర్మాధికాదుల కిట్లనియె.

510