పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ప్రాలేయభూధరప్రాంతకాంతార
                దేశభాసురసరిత్తీరములను
దాలతమాలతక్కోలహింతాలాది
                రాజతానేకమహీజములను
గిసలయవిసరసంకీర్ణనానాలతా
                మంజులోదారనికుంజములను
నిరుపమానతరంగిణీవేగసంజాత
                మహనీయసైకతమంటపముల


తే.

సొరిది విహరించుకపు లొకచోటఁ గూడి
కడిది చలిచేత మేనులు గడు వడంక
రాత్రి మెఱుఁగారుఖద్యోతరాజిఁ జూచి
కణఁకు గాఁబోలు నని సీతుగాఁచుచుండ.

495


క.

సూచిముఖ మనువిహంగం
బాచేరువనుండి యనల మది గా దని యా
లోచనము చేసి యొకకపి
కాచందము తెలియఁ జెప్ప నతికుపితంబై.

496


ఆ.

అడుగ కూర కేల నొడివితి విప్పుడు
వట్టితీఁట నీకుఁ బుట్టె ననుచుఁ
బట్టి దాని రాతిపైఁ బ్రామి వధియించె
హీనమతికి బుద్ధు లేలకొలుపు.

497


వ.

అట్లు గావున.

498


చ.

అనవరతంబు విశ్వవినుతాయతబుద్ధి విశేషవృత్తి నొం
డెను ధనవృత్తి నొండెను గడిందిబలంబున నొండె నెవ్వఁ డిం
పెనయఁ గులంబువారల నహీనగతిన్ భరియించు నట్టినం
దనుని ముదంబునం గనినతల్లియ తల్లి ధరాతలంబునన్.

499