పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దేశకాలధనాగమస్థితులఁ దెలిసి, యరులు మిత్త్రులుఁ దన కెవ్వ రని యెఱింగి
యెవ్వఁ డైనను నాశక్తి యిట్టి దనుచు, నధిపుఁ డెప్పుడుఁ జింత చేయంగవలయు.

330


వ.

అనిన విని సంజీవకుం డచ్చటి రాజకార్యప్రసంగం బెద్ది యనినఁ గదియం జని కూర్చుం
డి యల్లన నిట్లనియె.

331


క.

ఏకాలంబున రాజులఁ, జేకొని సేవకులు నమ్మి చెడు టది సిద్ధం
బీకొలఁది నే నెఱింగితి, నీకుం జెప్పంగఁ దగు ననింద్యచరిత్రా.

332


వ.

అనుచు నేకాంతంబున నిట్లనియె.

333


ఉ.

ఎప్పుడు మోసపోవక మృగేంద్రునిపైఁ దగువేగు వెట్టి తెం
పొప్పఁగ నాయతం బయిన నోపిక ముట్టినకార్య మైనచోఁ
దప్పక నిర్వహించుకొని ధాత్రికి నీవ యధీశ్వరుండ వై
చొప్పడకున్న మాబ్రతుకు సూవె వృథా వృషభాధిపోత్తమా.

334


వ.

అనిన సంజీవకుం డదరిపడి మృగేంద్రుని కరుణాకటాక్షంబు నాయెడ శిథిలంబు గా
దు గదా యనిస నతం డేకాంతంబుగా నిట్లనియె.

335


క.

విపరీతచిత్తవృత్తునిఁ, గపటి దయారహితుఁ జపలు గాంభీర్యగుణ
వ్యపగతు రా జని కొల్చిన, నపరాధము లేకయైన నాపద వచ్చున్.

336


వ.

అని మఱియును.

337


చ.

కొలువున కీవు రాఁ దడవ ఘోరకరాళవిశాలదంష్ట్రలన్
మెలఁగఁగ నిన్నుఁ బట్టి బలిమిన్ గళరక్తము మున్ను గ్రోలి క
ట్టలుక నిజాశ్రితప్రతతి కంతటికిన్ భవదీయమాంస మ
గ్గలముగఁ బంచి పెట్టుటకుఁగా నియమించె మృగేంద్రుఁ డుగ్రతన్.

338


వ.

ఇత్తెఱంగు నేఁడ కాదు పెద్దకాలంబునుండియుఁ బింగళకుండు నీనామంబు ప్రసంగ
వశంబునం గొలువులోపల వినంబడినయప్పు డసహ్యతయుఁ బ్రజ మెచ్చు
నీపారవశ్యంబును మెచ్చమియును నీవార లైనవారలయెడ నాగ్రహంబును నీవు
వెలిగాని సంపద కసూయయు నీయొప్పమికిఁ బ్రియం బందుచిత్తంబును నై యున్న
వాఁడు మున్ను నీకు శపథం బిచ్చి కొలిపించుటంజేసి యివ్విధంబునం దెలుపం
జనుదెంచితి నీకుఁ బొందైనతెఱంగు జూచుకొ మ్మనిన సంజీవకుం డత్యంత
దుఃఖాకులుం డగుచు నిశ్చేష్టితుం డై యూరకుండి కొండొకసేపునకు దమనకుం
జూచి యిట్లనియె.

339


ఉ.

పూని దురాత్మగమ్య యగుపొల్తుక చక్కదనంబుఁ బాత్రస
న్మాన మెఱుంగలేనినరనాథునివేకముఁ గష్టవృత్తిమై