పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాంచితభూరిసంపదల కాసపడున్ పడి హానిఁ బొందు నే
మంచితనంబు దుష్టు లగుమంత్రులకుం గలదే తలంపఁగన్.

276


గీ.

అతిసమర్ధుఁ డై మంత్రి కార్యములు దీర్చు, నపుడు హితమతి గాకున్న నదియుఁ గాదు
మిగుల ననురక్తుఁ డగువానిమీఁదఁ గరుణ, నవనిపతి యున్పకుండిన నదియుఁ గాదు.

277


వ.

అని వెండియు.

278


క.

సేవకులు లోకమందును, శ్రీవిశ్రుతు లైన నేల సేవింతురు ధా
త్రీవిభులఁ దమకు జరగమి, కై వలసినపంపు సేయ నగుఁ గాక మహిన్.

279


వ.

అనినం బింగళకుండు సంజీనకుండు నా కత్యంతస్నేహితుం డెట్లు విడువనేర్తు నని
యిట్లనియె.

280


గీ.

సకలదుష్టదోషసహితదేహం బిది, నాకు నేటి కనెడినరుఁడు గలఁడె
యట్లు నిజహితుండు నప్రియం బొకచోటఁ, గడఁగి చేసెనేని విడువరాదు.

281


వ.

అని పలికి సంజీవకు నుద్దేశించి.

282


ఉ.

నమ్మిక యిచ్చి చేకొని ఘనమ్ముగఁ బూజ్యునిఁ జేసి మాటమా
త్రమ్మున వీఁడు గాఁ డని వృథా బహుదోషము లెన్ని భృత్యు రా
రమ్మని యాజ్ఞ సేయ నగరా నను లోకమువారు వాని నే
రమ్మున వాఁడె పోవుఁ దెగ రాదు కలంపకు నాదుచిత్తమున్.

283


వ.

అనిన విని దమనకుం డిట్లనియె.

284


ఉ.

ఎంతయు గారవించి తను నింతయమాత్యునిఁ జేసి రాజ్య మి
ట్లంతయుఁ జేతి కిచ్చి యనయమ్మును దేవర నమ్మి యున్నచో
గొంతయినం దలంపక నిగూఢముగా మహి యెల్లఁ గైకొనన్
జింత యొనర్చు టే నెఱిఁగి శీఘ్రమ నీ కెఱిఁగింప వచ్చితిన్.

285


వ.

మఱియును.

286


గీ.

అన్నదమ్ముఁడైన నాత్మజుం డైనను, సచివపదవిఁ బనులు జరుపుచోట
దానిమీఁదృష్టి వదలినయప్పు డా, రాజుఁ బాయు నిందిరావధూటి.

287


చ.

సుజనహితోక్తి కర్ణముల సోఁకఁగనీయ కహర్నిశంబునుం
గుజనులబుద్ధి చిత్తమునఁ గూర్చి సరాష్ట్రము గాఁగ నమ్మహీ
భుజుఁడు నశించు రోగి తనబుద్ధి నపథ్యమె పథ్య మంచు న
క్కజముగ నాత్మలోఁ దలఁచి కాలవశంబును బొందుచాడ్పునన్.

288


ఉ.

అప్పటి కప్రియం బయి నిజాత్మకు మీఁదటికిన్ బ్రియంబుగాఁ
జెప్పెడు వాక్యముల్ విను సుచిత్తుఁడు నిచ్చక ముజ్జగించి మేల్