పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కావున నెంతటిబలవంతు నైనను బుద్ధిబలంబునంజేసి బుద్ధిమంతుండు గెలుచు ననఁ
గరటకుం డట్లకాక నీకుఁ కార్యసిద్ధి యయ్యెడు మరుగు మనిన దమనకుండు పింగళకు
సమ్ముఖంబునకుం బోయి నమస్కరించి యిట్లనియె. దేవరకు నే నత్యంతాపరా
ధంబు చేసితి సంజీవకునిఁ గొలువం బెట్టి తగనిపనిఁ జేసితిఁ గావున నీయపరాధంబు
సహింపవలయు నని యిట్లనియె.

266


క.

పదవిం బొందిన సచివుఁడు, పదఁపడి నృపునెదుట నెట్లుపలికిన నమరున్
బదహీనుఁడు తగుపలుకులు, పదివే లాడినను భూమిపతి కింపగునే.

267


క.

అనినం బింగళకుం డా, తనితో నీ వేమి చెప్పఁదలఁచిన నీకం
టెను హితుఁడు గలఁడె నాయొ, ద్దను వెఱవక చెప్పు మనిన దమనకుఁ డనియెన్.

268


క.

ఈసంజీవకుఁ డెప్పుడు, నాసన్నిధిఁ దప్పనాడి నగుచుండు నినున్
చా సరకుసేయఁ డేమిట, నీసున నినుఁ గొలువఁ జేరనీఁ డెవ్వానిన్.

269


చ.

అదియునుగా కతండు భవదాజ్ఞఁ జరింపక నీప్రభుత్వసం
పదయును మంత్రశక్తియును బ్రాభవశౌర్యమహోద్యమంబులున్
మదమునఁ దప్పనాడును గ్రమంబున నీమహిఁ దాన కైకొనన్
మదిఁ దలపోయు నేఁ దెలిసి మానుగ నీ కెఱింగింప వచ్చితిన్.

270


గీ.

అనిన భయవిస్మయమ్ములు మనముఁ గలఁప, నేమియును బల్కకున్న మృగేంద్రుతోడ
నధిప నీమంత్రి నీకంటె నధికుఁడైన, కతన నభివృద్ధి నీ కెట్లు గలుగు వినుము.

271


గీ.

మహిమ నత్యుఛ్రయుం డగుమంత్రిమీఁదఁ, బార్థివునిమీఁద నొక్కొక్కపదము నిలిపి
నిల్పి స్త్రీస్వభావంబున నిల్వలేక, యుదధికన్యక వారిలో నొకని విడుచు.

272


వ.

అన నతండు వెండియు నిట్లనియె.

273


సీ.

మనుజవరుఁడు నిజామాత్యుగా నొక్కని, నిల్బఁ దద్భారంబు నిర్వహించి
తనరు స్రక్చందనవనితాదిసుఖముల, మోహ మంతంతకు మురియఁబడఁగ
మోహంబుచే గర్వమునఁ గన్ను గానక, గర్వాతిశయమునఁ గానిపనులఁ
జేసి నిజేశ్వరుచే నొత్తు ననుబుద్ధి, నతని నుల్లంఘింప మతిఁ దిలంచుఁ


గీ.

దలఁచి దృఢతరముగ నేలి దళముఁ గూర్చుఁ, గూర్చి రాజ్యంబు తనకుఁ గైకొనఁగడంగుఁ
గడఁగి నృపపక్ష మగువారికడుపు కిడక, కుశలబుద్ధిని బతిఁ గాలవశునిఁ జేయు.

274


వ.

అని మఱియును.

275


ఉ.

పెంచి యనేకసంపదలఁ బ్రీతి వహింపఁగఁ జేసి తన్ను మ
న్నించిన రాజుమీఁదఁ దుది నేరము వెట్టి పరావనీశదే