పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెద్దలు విడిచినఁ బెరిఁగి యన్యాయంబు, ప్రబలంబు గాఁగ ధర్మంబు తొలఁగు
ధర్మంబు తొలఁగిన ధాత్రీతలం బెల్లఁ, జీకాకు పడి రూపు చెడి యడంగు


గీ.

రాజు పరిసరవర్తులు రాష్ట్రజనము, మున్న నశియించి చనుటకు మోస లేదు
గాన సర్వజ్ఞుఁ డనఁగ లోకంబుచేత, వినుతి బొందిన రాజు వివేక మమరు.

138


గీ.

అనుచు నిట్లు దమనకాఖ్యుండు పలికిన, నర్ధిఁ బింగళుండు నతని కనియెఁ
బొసఁగ మాకు మంత్రిపుత్త్రుండ వగుటను, జెప్పఁదగినబుద్ధి సెప్పఁదగదె.

139


క.

అన నతఁడు విన్నవించెద, ననఘా! యుదకార్థి నగుచు యమునానదికిం
జనుచుండి వెఱఁగుపడి ని, ల్చినకారణ మేర్పడంగఁ జెప్పుము నాకున్.

140


వ.

అనిన నాతం డిట్లనియె.

141


సీ.

ఈయున్నవన మెల్ల నాయధీనం బిది సర్వసత్త్వవ్రాతసంకులంబు
నిన్నాళ్లును గదలకుండితిమి యీ, విపినంబు నేఁ డింక వెడలవలసె
నెట్లన్న నొకశబ్ద మేమని చెప్పుదు, నశనినిరోషంబు ననుకరించి
నాకర్ణముల సోఁకినను భయం బొదవిన, విన్నచోటనె నిల్చి యున్నవాఁడ


గీ.

శబ్ద మూహింప నుత్కృష్టజంతువునకుఁ, గాని యల్పజంతువునకుఁ గలదె యట్టి
దేమి సేయుదు ననిన మృగేంద్రునకును, దమనకాఖ్యుండు వల్కె నందంద మ్రొక్కి.

142


వ.

దేవా శబ్దమాత్రంబునకు శంకింపం బని లే దవధరింపు మని యిట్లనియె.

143


గీ.

బహుజలంబుల సేతువు పగిలిపోవు, విను మరక్షితమంత్రంబు విఱిసిపోవుఁ
గొండియంబున సఖ్యంబు గ్రుంగిపోవుఁ, గఠినభావలఁ బడిపోవుఁ గాతరుండు.

144


వ.

అని మఱియును.

145


క.

నీ విన్న శబ్ద మిప్పుడ, యే విని తెలిసితిని బుద్ధి నెంతయు మును దా
భావించి నక్క తెలియదె, దేవా ఘనదారుచర్మతీవ్రధ్వనులన్.

146


వ.

అనినం బింగళకుం డవ్విధంబు తెలియం జెప్పు మనిన నతం డి ట్లనియె.

147


గీ.

ఎసఁగునాఁకటిపెల్లున నిందు నందు, నడవిఁ జరియించి యాహార మబ్బకునికి
నలసి యొకజంబుకంబు భాగ్యమునఁ గాంచెఁ, గలహ మొనరించి పోయినకదనభూమి.

148


సీ.

అఱిముఱి నంతంతఁ దఱుచుప్రోవులు గట్టి, యఱవఱలై యున్నయరదములును
దొండముల్ గొమ్ములుఁ దొడలు మస్తకములు, ఖండంబు లైనవేదండతతులుఁ
జరణంబు లూరులు బరులుఁ గంధరములుఁ, దునకలై పడియున్న తురగములును
గంకణాంగదములఁ గడు నొప్పి విఱిగిన, బాహుదండంబులభటకులంబుఁ


గీ.

గలిగి భీభత్సరౌద్రశృంగారములకు, నాస్పదంబుగఁ గనుపట్టునట్టినేల
కౌతుకంబునఁ బొడగాంచి కదియునంత, నవల నొకమహాధ్వని గుండె లవియ నిగుడ.

149