పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నేఁ డించుకతడవు మద్గృహంబున నిలువు మని నిలిపి తైలాభ్యంగనస్నానం బాచ
రించి ధౌతపరిధానశోభితుం డై మహాదేవు నర్చించి గృహదేవతలం బూజించి
విశుద్ధాత్ముం డయి యుండ నంత విధిప్రేరితం బైనక్షపణకత్రయం బావైశ్యకుమారుని
ముందఱం బొడచూపి నిలిచిన నతండు వారలం బూజించి తదీప్సితాహారంబులఁ
దృప్తులం జేసి లగుడఘాతంబుల నమ్మువ్వురం బ్రహరించిన వారు సంపూర్ణనిధి
త్రయం బగుటయుఁ దద్ధనంబుఁ దనగృహంబున నిండించుకొని సుఖంబుండి
నాపితునకు విశ్వాససంరక్షణార్థంబుగా సువర్ణనిష్కశతం బొసంగి నిగూఢంబుగా
ననిపిన.

51


క.

కొనిపోయి నిష్కశతమును, తనకాంతకు దాఁప నిచ్చి తద్వృత్తాంతం
బెనయంగఁ దెలిపి మంగలి, మనమునఁ దలపోసి వైశ్యమతముం జేయన్.

52


వ.

తనభార్య కిట్లనియె.

53


క.

పరదేసు లైనజోగుల, తిరిపంబున నడఁచి ధనముతిప్పలఁ బడసెన్
వెర వెఱిఁగి సెట్టిబిడ్డఁడు, తరుణీ నే నొద్దనుండి తప్పక కంటిన్.

54


వ.

అని క్షౌరకుండు క్షారాభ్యంగనస్నానధౌతపరిధానాదికర్మంబు లావైశ్యకుమారు
నట్ల తానును నాచరించి వేల్పుల వలగొని భిక్షుకాగమనంబును గోరుచుండు
నంత నప్పురంబునఁ గాపురం బున్న వృద్ధు జంగమయ్య యొక్కరుండు క్షౌరకునిగృహ
ద్వారంబు చొచ్చి లోపలికిం జని ధర్మమే సంచితార్థం బని పేరెలుంగున భిక్షం
బడుగుటయుఁ గనుఁగొని నాపితుం డాభిక్షున కిట్లనియె.

55


గీ.

నీవు గాక యుండ నెరయంగ నిరువురఁ, దొడికి వచ్చితేని నొడిక మైన
భంగి మువ్వురకును భైక్షంబు పెట్టెదఁ, గూర్చి తెమ్ము మ్రొక్కు తీర్చుకొనఁగ.

56


వ.

అనినం బ్రమోదంబు నొంది యాభిక్షుకుండు మఱియును నిరువురం దోడ్కొని
వారుం దానును జనుదెంచి నిలిచినం జూచి క్షౌరకుండు.

57


గీ.

మెచ్చు లొదవంగ నర్చన లిచ్చి వారి, కిచ్చవచ్చిన భోజనం బిడుచు నుండి
త్వరితముగఁ బాఱి వాకిటితలుపు వైచి, శీఘ్రగతి ముట్టి లగుడంబు చేతఁ బట్టి.

58


క.

పొడవు గలజంగమయ్యను, బెడతల లగుడంబుచేత బెట్టడువ మహిన్
బడినఁ గని పాఱునిరువుర, బడి తప్పక మొఱలు పెట్టఁ బరువడి నడచెన్.

59


క.

అప్పుడు మొఱ్ఱో యనుచుం, దప్పక మువ్వురును గూయఁ దలవరులు వడిన్
దప్పు గొని మదురుగోడలు, కుప్పించి యదల్చి వెఱవకుఁడు మీ రనుచున్.

60


వ.

ఆభిక్షుకత్రయంబును మోపించుకొని నాపితుం బెడకేలు గట్టికొనివచ్చి భూవరు
సమ్ముఖంబునం బెట్టిన నతండు నాక్షౌరణనిం జంపించి తద్గృహంబు సర్వంబునుం