పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నేల నృపాలుకొల్వునకు నేగతి వచ్చె నవస్థ యంచుఁ జిం
తాలసుఁ డైననాథునకు నంగన యిట్లనియెన్ ముదంబునన్.

219


ఉ.

ఎన్నికబంట వీవు నిను నేలిక పిల్చి ప్రియంబు చెప్పినన్
సన్నక సన్నఁ బోక పెఱసన్నల సాకులు పన్ను టొప్పునే
తిన్నఁదనంబుతోడఁ బని దీర్చుక వచ్చి సుఖింతు గాని పో
కున్న నృపాలుఁ డుగ్రుఁ డదయుండు చలంబున నేమి సేయునో.

220


వ.

అని ససంభ్రమంబును సకౌతుకంబునుంగా నమ్మగువ యతని మజ్జనభోజనాదులం
బరితృప్తుం జేసి తాంబూలం బిచ్చి సెజ్జకుఁ దార్చి యిట్లనియె.

221


క.

తడ నోర్వవు ప్రాణంబులు, దడసి నినుం బాసి నాకుఁ దప్పదు నీకున్
బడఁతుక లచ్చటఁ గల రని, తడవును రా కున్న విడుతుఁ దనువు నిజేశా.

222


గీ.

అనుచుఁ గందర్పసంక్రీడ నాత్మనాభు, నుల్ల మలరంగ నేర్పుల నోలలార్చి
చలిదియును సంబడంబును జాల మెసఁగి, ప్రొద్దు గ్రుంకెడునంతన పుచ్చె నతని.

223


క.

పుచ్చి యుపనాథుఁ బిలువం, బుచ్చి యుదక మాడఁబోవఁ బోవక మగుడన్
వచ్చి యిలు చొచ్చి సూతుం, డచ్చటిమంచంబుక్రింద నడఁగినవేళన్.

224


వ.

పదంపడి యక్కాంతయు.

225


చ.

ఒడలికి నాడి సన్నమణుఁ గొప్పఁగఁ గట్టి సుగంధ మంతటం
బొడవడకుండ మేన నెగపూఁతగఁ బూసి వినీలకేశముల్
ముడి వడకుండఁ దీర్చి విరులుం గురువేరుఁ గదంబకంబుగాఁ
బొడవుగఁ గొప్పు పెట్టి మణిభూషణముల్ ధరియించె వేడుకన్.

226


గీ.

ఇవ్విధంబునఁ గైసేసి యిందువదన, దీప్తు లడరంగ నద్దంబు తెచ్చి చూచి
తనముఖావయవంబులు తానె మెచ్చి, సుదతి యుపకాంతున కెదురు చూచుచుండె.

227


వ.

అయ్యవసరంబున నుపనాథుండును నతిసంభ్రమంబున నలంకరించుకొని దూతి
కానుగమ్యమానుండై పద్మముఖిమందిరంబునఁ బ్రవేశించి పర్యంకంబునందుఁ
గూర్చుండి యుండె.

228


క.

ఆసమయంబునఁ బుష్పశ, రాసనుసామ్రాజ్యలక్ష్మి యన శృంగారో
ద్భాసితయై నిజపర్యం, కాసనమునఁ గాంత జారు నల్లన చేరెన్.

229


వ.

ఇట్లు చేరినకాంతాతిలకంబునకుం గదిసి యతం డిట్లనియె.

230


ఉ.

ఎప్పుడు పిల్చుఁ బద్మముఖి యెప్పుడు దానిప్రియుండు వోవు న
న్నెప్పుడు గారవించుఁ గమలేక్షణ యంచు నహర్నిశంబు