పుట:నృసింహపురాణము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

నృసింహపురాణము


వ.

అని యనేకవిధంబులం గొనియాడుచుం జని వినువీథి నంబుధినిందఱియం జొచ్చి
దవ్వుదవ్వులయందు శ్వేతద్వీపంబును దన్మధ్యగోచరంబును నగువైకుంఠపురంబునుం
గని మ్రొక్కి యొండొరులకుం జూపుచు.

7


శా.

ఈవారాశికి దానభూషణముగా నీదేవి శుభ్రాంబుజ
శ్రీవిభ్రాజిత మయ్యె దీనినడుమన్ జెన్నొంది హేమోజ్వలం
బై వైకుంఠపురంబు కర్ణికతెఱం గారంగ నిందూర్జిత
శ్రీవత్సాంకునిఁ జూత మింక ప్రమదస్థేమున్ మహాళీంద్రుఁగాన్.

8


క.

అని పలుకుచుఁ జిత్తంబులు, ఘనతరభక్తిరసభరితకలితము లై పే
ర్చిన నమరవరులు నిజకర, వనరుహపుటఘటితనిటలవన్మస్తకు లై.

9


శ్లోకము.

శ్వేతద్వీపాయ సంసారతిమిరశ్వేతభానవే,
నమః కైవల్యకంఠాయ వైకుంఠనగరాయ చ.

10


వ.

ఇట్లు తొడంగి బహువిధస్తోత్రనాదంబులు రోదోంతరంబున మేదురంబులుగాఁ బు
రంబు సొత్తెంచి రాజమార్గంబున రాజమందిరాభిముఖులై వచ్చుదివిజులకలకలం బా
కర్ణించుచు వైకుంఠనాథుండు ననాథనాథుండును నగు శ్రీనాథుండు నాకౌకసులం
దడయక తోడ్కొని తేర వైనతేయు నానతిచ్చి పుచ్చిన.

11


సీ.

భాసురసౌవర్ణపక్షయుగ్మముకంటెఁ బ్రకటితం బగుబంధుపక్ష మమర
సంచితహరిచందనాంగరాగముకంటె రాజితం బగుముఖరాగ మెసఁగ
లాలితహారాద్యలంకారములకంటెఁ బూరుషాకారంబు భూషణముగ
నభిగమమృదుపదన్యాసంబుకంటెఁ బ్రియోక్తపదన్యాస ముల్లసిల్ల
గీ. విబుధకోటి నెదుర్కొని వినతపట్టి, యాదిదేవునియాదరం బపుడు చెప్పి
యందఱును సంతసిల్లంగ నంతిపురము, కొల్వుకూటంబునకు వారిఁ గొనుచుఁ జనియె.

12


చ.

అనుపమలీల నొప్పుపరమాత్మునిదివ్యసభానివాసమున్
గనుఁగొని యద్భుతప్రమదకౌతుకపూరములన్ మునింగి య
య్యనిమీషకోటిచి త్తము నిరంతరదైత్యవికారఘోరవే
దనఘనభార మెల్ల దిగద్రావి భజించె నవీనభావమున్.

13


అంగవర్ణవచనము

వ.

ఇట్లు సభామంటపప్రవేశం బొనరించి యనంతరంబ వా రగ్రభాగంబున నుదగ్రభో
గిభోగమహాశ్వేతశయనీయంబునఁ గమనీయహిమశైలశృంగసంగతంబగుసతోయతో
యదంబుచాయకు నుపమేయం బగుచుం బొలుపారుసోయగంబును, నవపారిజాతపల్ల
వంబులయుల్లాసంబు నుల్లసం బాడుచు శ్రుతిసీమంతసిందూరరంజనరంజితంబులైనవి
యివి యవి యనికొని యాటలకుం జాలరాలఁ జెన్నొందుచరణతలంబులును, వరణాం