పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బున రఘురాముఁ డున్నయెడఁ బొల్తుక యొక్కతె యేగుదెంచి యా
తనిఁ గని కాముచే నలఁగి ధైర్యవిహీనతఁ గోర్కిఁ జెప్పినన్.

72


తే.

అతఁడు నగి త్రిప్పిపుచ్చిన ననుజుకడకు, నరిగి యాతండు ద్రోచినఁ బెరిఁగి వికృత
వేషయై యెత్తికొనిపోవ రోష మెత్తి, యక్కుమారుఁడు వెసఁగోసె ముక్కుసెవులు.

73


క.

భంగపడి రాముకడ క, య్యంగన చనుదెంచి యిట్టు లనియెఁ ద్రిలోకో
త్తుంగచరిత్రుఁడు శశ్వద, భంగుం డగుపంక్తివదనుభగినిం జుమ్మీ.

74


తే.

శూర్పణఖ యనుదాన మీదర్ప మడఁప, నసుర లిప్పుడ వచ్చెద రనుచుఁ గోప
మునఁ గడంగి జనస్థానమునకు నేగి, యనుజుఁ డగు ఖరుతోడఁ జెప్పిన నతండు.

75


క.

దూషణునిఁ ద్రిశిరుఁ గూడి స, రోషంబుగ నెత్తి వచ్చి రోగంబులు ది
వ్యౌషధముఁ దాఁకుపగిది మ, నీషమెయిం జాలు రాము నెదిరి మహాజిన్.

76


చ.

పొలిసినఁ జూచి శూర్పణఖ పోయి దశాననుఁ గాంచి బన్నముం
దెలుపునెడం బ్రసంగమునఁ దేటపడన్ వినిపించె సీతకో
మలతనులీల యద్దివిజమర్దనుఁడున్ హృదయంబునం గుతూ
హల మెలరార శీఘ్రగతి నయ్యెడ కేగె వియత్పథంబునన్.

77


క.

చని కౌటిల్యమున మహీ, తనయం గొని లంక కరిగె దానవుఁ డపుఁ డా
మనుజేంద్రనందనుఁడు దన, మనమునయడ లనుఁగుఁదమ్ముమాటల మలఁగన్.

78


సీ.

ఎడసొచ్చి దైత్యుచేఁ బడినజటాయువువలన నంగన చన్నవల నెఱింగి
శరణార్థి యగుదివాకరసూతిఁ జేకొని కోలతోడనె వాలిఁ గూల నేసి
వనచరబలముల వసుధ నెల్లను నొక్కవాయిగా నడపించి వార్థిఁ గడచి
లంకపై విడిసి చలంబు బలంబును జూపి రాక్షసకోటిరూ పడంచి


తే.

కుంభకర్ణునిఁ గుంభనికుంభనాము, లైనతనయులతో నంతకాలయమున
కనిచి దేవాంతకప్రహస్తాదిబంధు, వర్గసహితంబుగా దశవదనుఁ దునిమి.

79


తే.

అఖిలదేవతాసన్నిధి నగ్నిదత్త, యైన జానకి నానంద మతిశయిల్లఁ
గైకొనియె రాముఁ డీమూఁడులోకములకు, నద్భుతప్రీతు లడరి పొంగారుచుండ.

80


క.

ఇంద్రజి ననిలోఁ జంపి మ, హేంద్రాదిత్రిదశనుతుల కెక్కినయనుజున్
సాంద్రానుమోమున రఘు, చంద్రుఁడు మో మెలమిఁ బొంద సంభావించెన్.

81


ఆ.

అతని నపుడ దివ్యయానరత్నం బగు, పుష్పకంబుఁ దేరఁ బుచ్చి దాని
కెదురువోయి యర్చ లిచ్చి సంప్రీతి నా, తండు జానకియును దాను నెక్కి.

82


చ.

శర ణని వచ్చి చొచ్చి యనిశంబును గొల్చుచు నున్న రావణా
వరజు విభీషణున్ సమరవర్తనుఁ డైనదినేంద్రనందనున్
శరనిధి దాఁటి దేవిఁ గని, చయ్యన నుంగర మిచ్చి పేర్చి య
ప్పురవర మేర్చి లోకనుతిఁ బొందినపావని నాదరించుచున్.

83