పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోవుట నెగ్గు లే దతఁడు పొచ్చెము సేయక సమ్మతించి సం
భావన సేయు నన్న జనపాలక సమ్మద మంది వచ్చితిన్.

8


క.

పనిగొనుము నన్నుఁ గైకొని, యనునప్పలుకులకు మానవాధీశుఁడు సం
జనితబహుమానుఁ డై యి, ట్లనియెం బుష్పకవిమాన మానందింపన్.

9


క.

ఏవలన నుండి యైనను, నావలసినయపుడ గ్రక్కునం జనుదేరం
గావలయుఁ దలఁచునంతకు, నీవల నెట్లట్ల తిరుగు నిఖిలజగములన్.

10


క.

సిద్ధులగమనంబులకు వి, రుద్ధముగాఁ జనకు మానరోషంబులు స
ద్బుద్ధులకుఁ దగమి యెఱిఁగి జ, గద్ధితమతి సంచరింపు గౌరవ మొప్పన్.

11


తే.

అని మహీపతి ముక్తాయతాక్షతములు, గంధపుష్పంబులును గొని గౌరవమున
మన్ననకుఁ దగుదివ్యవిమానమునకు, నర్చనము నిచ్చి వీడ్కోల్ప నదియుఁ బ్రీతి.

12


క.

తన కిష్ట మైనయెడకుం జనినయనంతరమ రాజసత్తముతో ని
ట్లనియె భరతుండు పరిజను, లనుమోదరసానుభావితాంబుధిఁ దేలన్.

13

భరతుఁడు రామునిఁ బొగడుట

ఉ.

చోద్యముగా నమానుషవచోరచనల్ విలసిల్లె నెంతయున్
హృద్యము గాఁగ నామయవిహీనత నొప్పెఁ దపఃప్రకర్షముల్
మాద్యదరాతిసంచరణమార్గము లెల్లను మాసె నెందు సా
వద్యులు లేరు బాలమృతివాదము లేదు ధరిత్రి నెయ్యెడన్.

14


చ.

కొడుకులఁ గాంచి రంగన లకుంఠితసిద్ధులఁ బొందెఁ గర్మముల్
గుడువఁగఁ గట్ట నెల్లజనకోటికి నేమిఁ గొఱంత లేద యి
ప్పుడు భవదీయరాజ్యమున భూవరకుంజర సౌఖ్య మంది యి
ప్పుడమికి నిన్ను శాశ్వతవిభుండుగఁ గోరెద రెల్లవారలున్.

15


క.

అనవుడుఁ దమ్మునిపలుకులు, విని మది ముదమంది మోము వికసిల్లఁగ నా
తనిఁ బ్రీతి వొందువీక్షణ, మున సీతావల్లభుఁడు ప్రమోదితుఁ జేసెన్.

16


ఆ.

పుష్పకప్రసంగమునఁ దనుఁ గొనియాడు, భరతు నివ్విధమున భరితపరమ
హర్షుఁ జేసి సమయ మగుడు నాస్థానమం, డపము వాసి చనియె నృపవరుండు.

17

శ్రీరామునివినోదవిహారము

ఉ.

నిచ్చలు నిత్తెఱంగున ననింద్యచరిత్రుఁ డనేకభంగులన్
వచ్చినవిన్నపంబు లనివారణమై విని నిశ్చయంబుగా
నిచ్చుసదు త్తరంబులకు నెల్లజనంబులు సంతసిల్ల రా
లచ్చి నహీనసద్గుణకలాపములం దగిలించె దక్షుఁ డై.

18


చ.

ప్రజ ననురాగ మందఁ బరిపాలన సేయు నరేశ్వరుండు దో
ర్విజితవిరోధి యై తుదిని వేడ్క మెయిన్ విహరించు నెందు నా