సంచిక 2
ఉపోద్ఘాతము
135
అని వ్రాసికొని కృతి నామావశేష యయ్యె నని భావించిన స్థితిలో నిది యిప్పు డిట్లు లభించుట యాంధ్రభాషాభిలాషుల కమూల్యమాణిక్యము లభించినట్లే కాదా? జగన్నాథకవిచే నుదాహృతమైన పైసీసపద్యమే ప్రస్తుతము ప్రకటింపఁబడిన యీనారసింహపురాణమునందు విశేషపాఠభేదములతో నిట్లు కనఁబడుచున్నది: ---
సీ. | మందారదామంబు నిందుఖండంబును మౌళిభాగంబునఁ గీలితముగఁ | |
ఈరెండుపద్యములకును సీసపాదములలోఁ గొన్నిపాఠాంతరములు గాన్పించుచుండుట వింతగాదు: కాని కడపటి యెత్తుగీతము లొకదానితో నొకదానికిఁ బోలికయే లేక యున్నవి. ఇది చిత్రము! జగన్నాథకవిచే రత్నాకరమున సుదాహరింపఁబడిన దని రామకృష్ణకవిగారు వ్రాసిన సీసగీతి నించుమించుగాఁ బోలుచున్న మఱియొక సీసగీత మీగ్రంథమున నీహరిహరాకృతిసందర్భముననే యిట్లున్నది.
సీ. | - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - | |
మఱియు నిందలి ద్వితీయాశ్వాసమున మఱియొక సందర్భమునఁ జెప్పఁబడిన 15వ సంఖ్య గల కందపద్యములోని కొంతభాగము, మీఁద నుదాహరంపఁబడిన గీతపద్యభాగమును బోలు మన్నది.
క. | చీఁకటియుఁ జంద్రికారస, మేకస్థానంబునంద యిరవొందుగతిన్ | |
మఱియు నీహరిహరరూపైక్యమును వర్ణించు సీసపద్య మింకొకటి గూడ నిందుఁగలదు. పైపద్యములయం దిట్టివిశేషపాఠభేదము లెట్లు గలిగినవో నిర్ణయించుట గాని కవికంఠోక్త పాఠము లివియని నిశ్చయించుటగాని మనకు శక్యము గాదు. తఱచుగా నిట్టి భేదములు లేఖకులయు, సంస్కర్తలయు, ముద్రాపకు