పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 15

క. ఎదిరినపగ మీలోపల, ముదిరినయది లేదు లోకములు గూఁకలిడన్
     గదనము సేయఁగఁ దగునే, మదనజనక మదనదమన! మానుఁడు గినుకల్. ప్ర. ఆ. 205
సీ. సమరాభిముఖు లైన యమరవీరుల గిట్టి యనిమొనఁ దుత్తుమురాడవలదె
     దర్ఫితదండయాత్రాభేరిభాంకారఝంకారముల మిన్ను చఱవవలదె
     యుత్పలదళముల యొప్పునఁ బైకొను నరిశిలీముఖముల నాఁపవలదె
     తుంగమాతంగశతాంగతురంగాంగశకలకోటుల నేలఁ జమరవలదె
     కలవె యొకనిఁ గొలిచి గర్వవిహీనుఁడై, యూడిగములు సేయుచున్న పతికి
     ధూర్తవిజయలబ్ధికీర్తిప్రతాపంబు, లసురసుతున కిట్టు లడఁగ దగునె? ద్వి. ఆ. 57
ఉ. పక్షికులేంద్రవాహనుని బల్విడి దోలఁగరాదొ------- ద్వి. ఆ. 64
శా. అన్నా! యన్నలుఁదమ్ము లైనమిము) మున్నాక్షేపముల్ పల్కి నే
     నిన్నాళ్ళేలితి మూఁడులోకములు--------- తృ. ఆ. 91
మ. తపముల్ సేయుచు వ్రస్సి క్రుస్సి విపినాంతర్వాసులై------ తృ. ఆ. 95
క. గర్వించి యశోవా మృ, త్యుర్వా యని దివిజబలమహోగ్రాకృతివై
     గీర్వాణ విమతజలనిధి, పర్వతమై నిలువవయ్య పాకధ్వంసీ. చ. ఆ. 26
క. జలధిపతి బలపరాక్రమ, ములు జలలిపులుగ నొనర్చి ముచ్చెరువుజలం
     బులు ద్రావించిన నీయు, జ్జ్వలవిక్రమ ముగ్రతరము శత్రుధ్వంసీ! పం. ఆ. 36

గ్రంథవిస్తరభీతిచే స్థాలీపులాకన్యాయముగ నీ పద్యము లెత్తి చూపఁబడినవి. కాని కవిత్వమంతయు నిట్లే మృదుమధురముగనుండును.

ఈ గ్రంథమునం దచటనచట నంత్యానుప్రాసాది శబ్దాలంకారములుగల పద్యము లుండుటం బట్టియుఁ గొన్నిపోలికలంబట్టియుఁ జూడ గ్రంథకర్తకు బమ్మెర పోతనామాత్యుని కవిత్వమునందు మిక్కిలి యాదరమున్నట్లు తెలియవచ్చుచుండును. ఈ యాదరమే యేతత్కవిని భాగవతస్కంధములు రచింపఁ బ్రోత్సహించెనేమో?

మ. శరభేంద్రుండు మనంబులోఁదలఁచె రక్షస్సైనికాభీలముం
     జిరవైరోద్ధతభాస్కరోద్భనశిరచ్ఛేదక్రియామూలముం
     బు రసప్రావళి భూరిమేఘవిలయప్రోద్భూతవాతూలమున్
     వరఘంటాజనితాతిదీర్ఘనినదన్యాలోలమున్ శూలమున్. ఆ.1.188
ఉ. విక్రమసత్త్వసంయుతుఁడు వీరనృసింహుడు లోఁదలంచె ని
     ర్వర్తపరాక్రమక్రమధురంధరసాహసికత్వవిభ్రమో