Jump to content

పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వేగవంతంబైన కాలచక్రంబుచే సదా త్రిప్పంబడి జీవుండు యోనిసహ
స్రంబుల జనియింపుచుండుఁ గాని నరుండై యుండుట నిత్యంబు గాదు;
జనుం డొప్పు యెల్లియో యెల్లుండియో మృత్యు వాసన్నం బని యెఱుం
గఁడు; జన్మమరణనరకక్లేశంబులు ధ్రువంబులు స్వాస్థ్యంబు లేదు
గాన బ్రతికినయన్నినాళ్లు హరిభజనంబు సేయవలయు ననేకజన్మంబులు
గాంచి కర్మభూమిని మనుజుండై జనియించుట నెన్నం డిటువంటి జన
నంబు నొంది వృథాప్రయత్నంబున నుండుట దగునె? నరులలో
విప్రత్వంబు నొందుట మిగుల దుర్లభంబు. తద్విప్రత్వంబు నొందియు
హరిభజనంబు లేక యుండుట దగునె? వ్యాధివ్యాఘ్రగ్రస్తంబైన
తాపత్రయమహోగ్రమృగసింహభయంబైన సంసారాతివనంబునందు
నరునికి రక్షాన్వేషనంబు సేయక క్రీడించఁదగునే? విషయవ్యాధిమహా
సర్పంబులతో భవతరుకోటరంబుల నుండి పురుషుం డనుగ్రహంబున
నిర్భయుండై గరుడవాహను నాశ్రయింపక యుండంజెల్లదు గానఁ దొల్లి
సురరూపంబున సుధాపానంబు సేయుచు విఘ్నంబు శంకించు రాహు
వున కైనయట్లు భజింపుచు శంకించిన హరి దుర్లభుండగు మనంబునం
దలంపవలయు; కరంబునఁ బాదార్చనంబు సేయవలయు; శ్రోత్రంబుల
దత్కథలు వినవలయు; దద్యశంబు భావింపవలయును; నేత్రంబులఁ
దత్ప్రియులైనవారిం జూడవలయు; పాదంబులఁ దత్పుణ్యక్షేత్రంబులు
ద్రొక్కవలయు; ని ట్లన్నిదినంబులు గడుపుచునుండువాఁడు బ్రతికిన
యతండు అట్లు సేయండేని వాఁడు జీవచ్ఛవంబు మక్షికామశకకాక
ముఖ్యంబులైన క్షుద్రజంతువులు కోటులకొలందులు బ్రదుకవే! కామ
మోహంబులు విడిచినవారు వైష్ణవులు. యోజనశతంబుల నున్న మర్త్యుం
డైన గంగాతరంగిణీనిజాంఘ్రిసంస్పర్శపవిత్రయైనదానిం దలంప
నఘశతంబులు దరింపంజేసిన నారాయణు భజింపుఁడు. హరిభజనం
బెవ్వండు సేయు నతండె సమస్తజనుల పాపంబులు హరించు. దీపం
బులు లేక యుండిన గృహంబులనేని దిననాథుం డుదయించి తమంబు
హరించునట్లు సందర్శనస్పర్శనపూజనంబులచేతఁ గుశలుండై న
భాగవంతుఁడు విష్ణుప్రతిమయుంబోలెఁ దమంబులు హరింపుచు దీపం
బుంబలె బరహితం బాచరింపవలయు లోకంబున.

273


క.

అనిన విని శౌనకాదులు
మనమున హర్షించి దైత్యమథనకథావ
ర్ణనసంశ్రవణకుతూహల
జనితోల్లాసమునఁ జనిరి సంరంభమునన్.

274