పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఇట్లు దైత్యేశ్వరునిక్రోధ మెల్లకార్య
ములయెడను శ్రీరమాజాని తలఁపఁజేసె
సద్గురుఁడు సంతతజ్ఞానశాలియైన
నరుని బోధించి నిలిపిన నలువు మెఱయ.

272


వ.

అటుగాన క్రోధావిష్కృతంబైన హరిస్మృతియు దైత్యునింద లంపంజేసె
నేమి చెప్పుదు. వీఁడు దశాననుండై శిశుపాలుండై జనియించి రామ
కృష్ణావతారంబులచేఁ బొలిసి పునర్జన్మంబు నొందఁడు. కృష్ణాశ్రయం
బైన క్రోధంబును, గృష్ణాశ్రయంబైన కామంబును, దైత్యులకు గోపిక
లకు మోక్షహేతువు, కేవల కామక్రోధములు జనుల కధఃపాత
హేతువు లహిదంష్ట్రలయందు సుధయుంబలె, చోరహస్తంబు
లందు ధనంబునుంబలె స్మరరోషంబులచేత నొంద రీముక్తికి నేమి
యద్భుతంబు కారణంబు హరిస్మృతియే. ఆహరిస్మృతియే స్మర
ద్వేషభక్తివిశేషంబులయం దుదయించు; నిష్టంబులు గాకయు
నౌషధంబులు ద్రావి రోగి యారోగ్యంబు నొందినట్లే నరుండు హరి
స్మృతివలన భవబంధంబులు వాయు; ద్వేషంబుననేని మృదర్ధంబుగా
భూమిం ద్రవ్వి నిదానంబు గనినయ ట్లజుండు కామక్రోధంబులనేని
హరిస్మరణంబు చేసి మోక్షంబు నొందు. అప్రయత్నంబుననేని ద్వేషం
బుననేని వైచిన ననలంబు కక్ష్యాంతరంబు దహించినయ ట్లనాద
రంబున నర్చించిన గిల్బిషంబులం బాయు; నజ్ఞుం డశ్రద్ధనైన సుధా
పానంబు చేసి వజ్రకాయుం డైనయ ట్లశుద్ధభావుండేని ముక్తుం డగు.
ఇది వస్తుస్వభావంబు. సూర్యుండు తమోనాశనంబునకు, శీతశాంతికి నన
లంబు నైనయట్లు, సర్వేశ్వరుండు లీలాప్తహృదయుండై ద్వేషులకు
మోక్షం బొసంగను, అనురక్తులకు నిష్టవరంబు లొసంగను సన్నద్ధుఁ
డైనవాఁ డద్దేవయోగంబునకంటె భక్తియోగంబు ప్రశస్తంబు; ఘోరం
బులైన మోక్షవిఘ్నంబులవలన హరి తానే రక్షింపుచునుండుఁ గాన నిటు
వంటి కరుణాసింధువు నాశ్రితవత్సలు నెవ్వం డాశ్రయింపండు? పాపా
త్ముండైన యాత్మద్రోహి యాశ్రయింపండు గాక! సదా సూర్యుండు
బహుయోజనసహస్రంబు లక్షణంబునఁ బోవుచు వేగంబునం జనుల
యాయువు క్షయింపంజేయు; నార్తప్రమత్తసుప్తవ్యాధితు లైనవారి
నుష్ణధాముండు హ్రాసంబు నొందించుం గాని విడంబంబు సేయండు.