పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

పరమసద్భక్తియే నాకుఁ బ్రాప్య మనఘ!
యదియ మరియును మఱియు నాయాత్మయందుఁ
బొడమె; నెపుడుఁ జతుర్వర్గమును లఖింపఁ
జేయుఁ జిత్రంబు గాదె చర్చించి చూడ.

245


వ.

కావున నేఁ బరమభక్తిం గోరుచున్నవాఁడ; భక్తిమంతుండె యధికుండు
మహాభయముక్తుం డైనమాత్రంబున నాభక్తి యెంత యాధిక్యంబు!
నీయందు హాస్యానాదరమాయలచేతనేని నిలిపినభక్తి నరులకు నింద్ర
పదంబు లభింపంజేయు; సాత్వికభక్తి యయ్యెనేని యేమి చెప్ప? భవ
త్ప్రేరితభక్తి, భవఘోరాబ్ధిని మునుంగువారికి సుత్తారణరజ్జువు,
మాయాతమశ్చన్నబ్రహ్మానందమహానిధి చూడంగోరినవారికి
యుష్మద్భక్తియే సిద్ధదీపిక; భవశర్వరియందు జ్ఞానదీపంబు మల్చుకొని
నిద్రించువారికి యుష్మద్భక్తియ సూర్యదీప్తి; సకలేష్టంబులకు జన్మ
భూమి; యనిష్టంబులకు వహ్నిశిఖ; మోక్షలక్ష్మికిం బ్రియసఖి; నీవు
దయ సేయక దుర్లభంబు; నాథ! యుష్మద్భక్తి సాత్త్వికియై స్థిరయై
నిల్చుంగాత! నిన్ను నుతింతు, నర్తింతు, హర్షింతు" ననిన భగవం
తుండు ప్రియోక్తుల నిట్లనియె.

246


సీ.

"ప్రియవత్స! నీకు నభీష్ట మెయ్యది యది
                       ప్రాపించు; సుఖమున బ్రతుకు మింక;
నంతర్హితుండనై యరిగిన ఖేదంబు
                       నొందకు; క్షీరాబ్ధి నున్నయట్లు
నీహృదయంబున నిల్తు; లక్ష్మికి నాకు
                       భక్తహృదయమె శోభనగృహంబు;
వైకుంఠదుగ్ధాబ్ధివాసవర్ణన నిత్య
                       శోభయె తెలియ; రక్షోభయములు


తే. గీ.

తలఁగఁజేయుదు దారుణతనువు గాన
మందిరము నిలుపుకొనఁగ మనుజసింహ
మూర్తి ననుఁ జూచెదవు; భక్తి మూఁడుదివస
ములకు" నని యేఁగె విస్మయమున భజింప.

247


క.

అంతట నానందాశ్రుదృ
గంతంబులఁ గంపమంది హరిఁ గానక దు
శ్చింతం బొరలుచు భేదా
నంతరమున ధైర్యలక్ష్మి యందె న్వేగన్.

248