Jump to content

పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైష్ణవులవైశిష్ట్యము

క.

తనువునఁ జక్రాంకము సే
యని మనుజాధములు గలుగు నావేశము లెం
చ నవైష్ణవములు దద్దే
శనివాసులు వైష్ణవులు నసాత్వికు లెంచన్.

124


సీ.

ఉరుశుద్ధసత్వమయుండు విదుఁడు విష్ణు
                       భక్తులు సాత్వికప్రవరు లార
జస్తమోమయదేవసముపాసన మొనర్చు
                       వారల సాత్వికుల్ వారియిండ్ల
నాపద వచ్చిన నన్నపానాదులు
                       వలువదు భుజియింపవలనెనేని
యతఁ డధఃపాతంబునందు నూర్ధ్వపదాను
                       [1]గతుఁడు విష్ణుండు లోకములు నట్లె


తే. గీ.

యుచ్చతరము లధఃపాత మొనరఁజేయు
సకలదుఃఖౌగములు నవైష్ణవజనాన్వ
యంబు నట్ల నధఃపాత మన నవైష్ణ
వాన్వయంబు జగంబుల నరసి చూడ.

125


క.

నందీశ్వరశాపంబున
నిందింతురు భాగవతుల నీచాత్మకులై
కొందఱు విప్రులు వారికి
సందిగ్ధ మెదంబెడంద సద్దండనముల్.

126


తే. గీ.

వరగుణాధికులైన యావైష్ణవులకుఁ
బ్రాతికూల్య మొనర్చిన ఫల మగమ్య
మైన దారిద్య్ర్య మిది చాల ననుభవించి
మఱియు నట్ల యొనర్తు రున్మత్తు లగుచు.

127


క.

తగునే విని సహియించుట
భగవద్భాగవతనింద పాపిష్ఠులు త
ద్భగవద్ద్రోహులు వారలె
యగుదురు మఱి వారికన్న నన్యులు గలరే?

128
  1. గతులు