ఆ. వె. |
కడుమదమున వీగఁ బడివాలు మడివాలు
వసనభార భారి వరలు దాను
గంసమందిరమున కంసరాజితవేణి
హంసగములతోడ నరుగునపుడు.
| 205
|
వ. |
తమకు ధౌతవస్త్రంబు లడిగిన నీక దుర్భాషలాడిన యాఖలున్
భంజించి తద్వీథిమధ్యంబున నేఁగుచు.
| 206
|
క. |
పాయక మాలాకారులఁ
బాయక మన్నించి శౌరి బలుఁడుం దానున్
బాయక వర్గముతో నిర
పాయకళామహిమ మెఱసి పాటిలుచుండెన్.
| 207
|
క. |
అనులేపనములు దెచ్చిన
ఘనపాణిని కుబ్జఁ గుజ్జు గాంచి పదమునన్
దనువెల్ల మట్టి యాయం
గన నాకక కుబ్జఁ బోలఁగా నొనరించెన్.
| 209
|
ఆ. వె. |
వాసి యెఱిఁగి యెపుడు వాసుదేవుఁడు దాని
బాసి విరహ మర్మదాసిఁ జేసె
[1]శిలబునర్చుతోంఛశిలఁ జేయు నాఘనుఁ
డేమి సేయ నేరఁ డీధరిత్రి.
| 210
|
ఉ. |
ఆవల నుగ్రచాపము మహాబలసంపదఁ ద్రుంచి దానికిన్
గావలి యున్న కాలభటకల్పదురల్పవికల్పజల్పలో
కావళి నుగ్గుగాను రుచిహావళి చేసె దురంతదుర్మదుల్
ధావన మాచరించి వసుధావనవీథులవెంట నేఁగగన్.
| 211
|
శ్రీకృష్ణుఁడు కంసుని సంహరించుట
తే. గీ. |
అపుడు సాయాహ్నశౌరి భావ్యతిశయమున
దివసమల్లునితోఁ బోరి ధృతి జయించి
తదురుగైరికరక్తవస్త్రంబుఁ జించి
కేరి యెగవైచె నన సంజ కెంపు దనరె.
| 213
|
- ↑ పాఠము అర్థవంతముగా లేదు.