పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యేకవింశతి సంఖ్యకున్న వైశిష్ట్యాన్ని గురించి సంగ్రహంగా యిక్కడ ఉటంకిస్తున్నాను. సంగీతశాస్త్రంలో 21 మూర్ఛన లున్నాయి. ఉత్తరమంద్రరంజని, ఉత్తరాయత, రుద్ధపడ్జ, మత్సరికృతు, అశ్వక్రాంత, హిరుగ్గత, యివి యేడూ షడ్జగ్రామాంతృత మూర్ఛనలు, ముఖ, ఆలాప, చిత్ర, చిత్రవతీ, సుముఖి, విశాలా, నంద, యివి యేడూ గాంధారగ్రామాంతర్గతాలు. నవ్వీరి, హరిణాశ్వ, కలోపగత, శుద్ధమధ్య, మార్గ, కౌరపి, హృశ్య, అని యేడు మధ్యగ్రామాంతర్గతమూర్ఛన లున్నాయి. వీటిల్లో గాంధారగ్రామాంతర్గతమూర్ఛనలు నారదుడు స్వర్గంలోనివారి కుపదేశించినట్లు ప్రసిద్ది. మనశాస్త్రాల్లో వీటికి వ్యవహృతి లేదు. వీటిని గురించి సంగీతశాస్త్రజ్ఞులకు మాత్రమే కాదు, సంగీతశాస్త్రకారులకు సైతం తెలియదని చెప్పవచ్చును.

కాలంలో మహాదోషాలుగా పరిగణింపబడిన యేకవింశ న్ముహూర్తదోషాలున్నాయి. అవి పంచాంగశుద్ధి, సూర్యసంక్రాంతి, కర్తరి, షష్ఠాష్టరి, (ఫకచంపు దోషాలు) ఉదయాంతశుద్ధి, దుర్ముహూర్తదోషం, గండదోషం, కుజాష్టమదోషం, భృగుషట్కదోషం, లగ్నాష్టదోషం, చంద్రసగ్రహదోషం, గ్రహణోత్పాతదోషం, క్రూరవిరుద్ధం, విషనాడీఘటికదోషం, క్రూరసంయతం,కుపవంశ, వాగజనితదుర్ముహూర్తం, ఖర్జూరికసమాంఘ్రి, అకాలగద్యుతం, మహాపాతం, వైధృతిదోషం. యీ యిరవైయొకటి ముహూర్తగతాలైన దోషాలుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

వాక్యగతాలైన కావ్యాదోషాలనుసైతం 21 సంఖ్యకు పరిమితంచేసి లక్షణకర్తలు పేర్కొన్నారు. అవి అక్రమం, విసంధి, ప్రక్రమభంగం, పునరుక్తి, అపూర్వం, వాద్యసంకీర్ణం, వ్యాకీర్ణం, అధికపదదోషం, వాచ్యవివర్జితం, అరీతి, న్యూనోపమ, అధికోపమ, సమాప్తపునారాప్తం, ఆస్థానసమానదోషం, ఛందోభంగం, యతిభంగం, పతప్రకర్షం, భిన్నలింగం, భిన్నవచనం, అక్రియ, (అశరీరదోషం), సంబంధ వివర్జితదోషంగా లక్షణకారులు పేర్కొన్నారు.

విరాగమోక్తాలైన దీక్షలుసైతం 21 సంఖ్యకు పరిమితాలుగా తత్వవేత్తలు పేర్కొన్నారు. ఇవన్నీ శాంభవనిర్మితాలని సంప్రదాయజ్ఞు లంటారు. వీటిని శివదీక్షలనిసైతం పేర్కొంటారు. ఈ 21 మహాదీక్షలు యివి. ఆజ్ఞ, ఉపమ, కలాభిషేచన, స్వస్తికారోహణ, భూతిపట్టా, ఆయత్త, స్వాయత్త, యీ యేడు దీక్షలు క్రియాదీక్షాంతర్గతాలు. ఏకాగ్ర, దృఢవ్రత, పంచేంద్రియార్పణ, అహింస, లింగనిజ, మనోలయ, సద్యోముక్తి, దీక్షలు యేడు = మనుదీక్షాంతర్గతాలు. సమయ, నిస్సంసార, నిర్వాణ, తత్త్వ, ఆధ్యాత్మ, అనుగ్రహ, సత్వశుద్ధి, నామకాలైన యీ యేడుదీక్షలు వేధాదీక్షాంతర్గతాలు.