పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హరిసంస్పర్శనవీక్షణ
పరిపూతశరీరుఁడైన ప్రహ్లాదుఁ గరాం
తరములఁ జూడగ వచ్చిన
కరణి దివాకరుఁ డుదయనగంబున నిల్చెన్.

249


క.

గిరి నుదయించిన యంతనె
హరియించె దిశాతమంబు లర్కుఁడు సర్వే
శ్వరభక్తిచేత నుత్కట
దురితములు జగంబులోనఁ దొలగించుగతిన్.

250


క.

తరణిఘటజన్ముఁడును దు
స్తరతిమిరాంబోధి గ్రోలఁ దత్తత్సుజనాం
తరతీర్థనిర్మలత్వము
స్ఫురితం బయ్యెం దిగంతము లహో! యనఁగన్.

251


ఆ.

సారసాప్తుఁ జూచి చక్రవాక ఖగంబు
హర్ష మందె; నాపరాత్ముఁ గాంచి
యోగివరుఁడు మోద మందినకైవడి
నంతరంగమునఁ బ్రియంబుఁ దోఁప.

252


ఆ.

అర్కుఁ డాజలాశయంబులఁ బ్రతిబింబ
మంది పెక్కుమూర్తు లయ్యె; క్షేత్ర
ములన నార్ద్రశీలములునుగా మెఱయ స
ద్గుణత వహించి తనరునట్లు.

253


క.

నలినములు సజ్జనులవలె
జలజాప్తపరేశమూర్తి సంపద వెలసెన్
కలఁగె న్నీలాబ్జంబులు
జలజాక్షుని కథలఁ దామసజనంబువలెన్.

254


వ.

అంతఁ బ్రతిబుద్ధజనస్వనంబు చెవులు సోఁకిన మేల్కని నిజపురంబు
నకుం జని హరిస్మృతిబలంబున నన్నిదిక్కులు హరిగానే వితర్కిం
చుచు, నడుగడుగునఁ దొట్రుపడుచు, హర్షింపుచు నగ్రంబున హరి
నీక్షించిన యట్లు జయజయస్వనంబులు పలుకుచు, హరిఁ జూడక
యార్తి నొందుచుఁ జరించె; సోత్కంఠుండై నాటనుండి శ్రీశహృతాంత