పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రంగుండై లోకజాడ్యహతుఁడై యలౌకికుండై జడునట్లు దురితంబు
లడంచుచు మంగళంబుల రమ్మని పిలుచుచు ననంతనామంబులు
గానంబు సేయుచు, నచ్చట నాడుచు, "శ్రీ గోవింద! కేశవ! ముకుంద!
శ్రీవల్లభ! శ్రీనాథ! శ్రీవైకుంఠ! సుకంఠ! కుంఠితఖల! స్వామి!
యకుంఠోదయ! శుద్ధధ్యేయ! విధూతధూర్త! ధవళశ్రీక! మాధవ!
యధోక్షజ! శ్రద్ధాబద్ధ! నీయందు నాకు బుద్ధి జనింపఁజేయవె,
యచ్యుతగుణా! అచ్యుతకళేశ! సకలేశ! శ్రీధర! ధరాధర! విబుధ
జనబుద్ధ! యాదరణచారణ! వినీలఘననీల! శ్రీధర! గుణాకర!
సుభద్ర బలభద్రకర్ణ సుఖపర్ణస! సుఖార్ణవ! మురారి! స్వర్ణరుచిరాం
బర! సుపర్ణరథ! యర్ణవనికేతన! భవార్ణవభవభయంబు మాన్పవే!
గుణగణార్ణవ! నమస్తే!" యని పాడుచుఁ దదప్రాప్తి గాఢదుఃఖాశ్రు
గద్గదుండై పొరలుచు, మొఱలిడుచు, విస్మితజనులు తనుం జుట్టుకొని
"నరకపతితజనులకు భవచ్చరణస్మరణంబు శరణంబు; భవవైతరణి
పతితుండనై దీనుండనగు నన్ను నేల నిరీక్షింపవు? నీయందు భక్తిఁ
బుట్టింపుచు, నీవె భవాబ్ధి మునుంగనీక రక్షింపవే! క్లేశంబు నొందితి
దయాపరమూర్తీ! నీకు దయ గల్గదేని కర్మవశాహతుండ నౌదు. కామ
క్రోధమదాద్యమిత్రనివహప్రోత్సారితోన్మాదవిశ్రాంతకుపితధృతి
హారదుర్నిగ్రహాదూరఘోరైకాదశేంద్రియఖలనంబులచే నార్జితంబైన
కర్మంబు, శిశువనై యొక్కరుండ ననుభవించుచున్నవాఁడ; నీకు దయ
లేకున్న నే నెట్లు గడతేరుదు; మానంబు శిరంబుపై పాషాణంబు;
మాత్సర్యంబు వలద్గరళజ్వాలామాలిక; క్రోధంబు కంటిలో నెరుసు;
భవనామకాంతారంబునందు మనోజవటుండు బుద్యాఖ్యయష్టి హరించె;
ముక్తిసరణి యెట్లు తరించెద”నని ప్రహ్లాదుండు పలుక విని యద్భుత
వైరాగ్యంబునకుం గొంద ఱశ్రువులు విడిచిరి; కొందఱు మ్రొక్కిరి.
లీలచేఁ గొందఱు హాస్యంబు చేసిరి; కొందఱు భక్తిం గాంచిరి; కొందఱు
విస్మయంబు నొందిరి; కొందఱు మూఁకలు మూఁకలై చూచుచు దురి
తంబులం దొలంగిరి; గోవిందకీర్తనానందనిర్భరుండై కీర్తననర్తన
గానంబుల జనులపై స్పృహలేక తిరిగె; అర్కుండు లోకతమో
భేదార్థంబు దిరిగినట్లు సంచరించె; నప్పుడు సముద్రముద్రామగ్నా
యాతుండైన యాప్రహ్లాదుం జూచి జనులు విస్మయం బందిరి; దైత్య