విజయంతో కళ్ళు మూసుకుపోయిన అసమర్ధ నాయకుడు రాజీవ్గాంధీ అని ఆ వ్యాసంలో పీవీ వ్యాఖ్యానిస్తూ, అంతటి భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడు ఐదేళ్ళలో ఎందుకంత బలహీన పడిపోయాడని, 1989 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, ఈ ఐదేళ్ళలోనే ఇంత తేడా రావడానికి గల కారణాలను ఈ వ్యాసంలో పీవీ విశ్లేషించారు.
అకాడమిక్ దృష్టితో రాసిన వ్యాసమిది. మెయిన్ స్త్రీమ్ పత్రికలలో “ది గ్రేట్ సూసైడ్” అనే పేరుతో ప్రచురితమైంది. ఆ తరువాత కాలంలో “ఫ్రంట్ లైన్” పత్రిక దీనిని పీవీ వ్యాసమని పునర్ముద్రించింది.
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై జాతీయ, అంతర్జాతీయ వేదికల నుంచి పీవీ నరసింహారావు గారు చేసిన అసంఖ్యాకమైన ఉపన్యాసాలు అన్నీ ఆయనకు ఆయా విషయాలపై గల సాధికారికతను సూచిస్తాయి.
పీవీ గారి హాస్యం
గంభీరసాగరుడు, మౌనముద్రాంకితుడుగా పేరు పడ్డ పీవీ నరసింహారావు గారిలో హాస్యచతురత అపారం. నోరు తెరిస్తే, సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, ఛలోక్తులు తొణికిసలాడేవి. తరచిచూస్తే, ఇవి ఆయన ప్రతి రచనలోనూ మనకు దర్శనమిస్తాయి. “ఇన్సైడర్” నవల ఒక వ్యంగ్య, హాస్య రసాత్మకమైన రచన. కాళోజీ నారాయణరావు గారి షష్టిపూర్తికి పీవీ రాసిన కవితలో కూడా ఈ హాస్యం కాట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
కుంటిదే అయినా ఇంటిది
ఐక్యరాజ్యసమితి పాత్రపైనా, దానీ వైఫల్యాలపైనా ఒకసారి పీవీ వ్యాఖ్యానిస్తూ, ఆ సంస్థకు ఎన్ని వైఫల్యాలున్నా, అదే మానవజాతికి ప్రస్తుతం అందుబాటులో వున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ అని చెప్పారు. “కుంటిదే అయినా ఇంటిది” అన్న సామెత ఐక్యరాజ్యసమితికి బాగా సరిపోతుందని, ఎప్పటికైనా దాని ఉపయోగం ఉంటుందని నేను నమ్ముతున్నానని ఆయన అన్నారు.
కాపీ ఇవ్వలేను కానీ కాఫీ ఇస్తాను
పీవీ గారు ప్రధానమంత్రి కావడానికి కొద్దిరోజుల ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ బి. నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయనకు నివాళి అర్పించేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీకి వచ్చిన పీవీ తిరిగి ఢిల్లీకి పయనమవుతుండగా, అక్కడే వున్న పలువురు జర్నలిస్టులు “సార్ ఏదైనా కాపీ ఇవ్వండి పత్రికా భాషలో వార్త” అంటూ పీవీ ని చుట్టుముట్టారు. ఆయన నవ్వేసి, “రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను. ఢిల్లీ నుంచి నా పుస్తకాలను హైద్రాబాదుకు షిఫ్ట్ చేసే పనిలో వున్నాను. నేనేం కాపీ ఇవ్వగలను, కాకపోతే మీకు మంచి కాఫీ మాత్రం ఇవ్వగలను” అంటూ చమత్మరించారు. దీనీతో అందరూ హాయిగా నవ్వుకున్నారు.
కుంటి లక్ష్మి
పీవీ గారి వద్ద ఎన్నికల ప్రచారానికి గ్రామాలలో తిరగడానికి ఒక పాత జీపు ఉండేదట. ఆయన దానికి “కుంటి లక్ష్మి” అని పేరు పెట్టారు. మిగతా రోజుల్లో అది వంగరలో వారి ఇంటి ఆవరణలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడి ఉండేదట. ఎన్నికలు సమీపిస్తుంటే “ఆ కుంటి లక్ష్మిని బయటకు తీసి బాగు చేయించండి, ఎలక్షన్లకు అదే గతి” అని ఛలోక్తి విసిరేవారట.
ప్రయాణాలలో పాటలు, పద్యాలు
పీవీకి శాస్త్రీయ సంగీతమంటే మక్కువ. రాగ, తాళ గతులను గుర్తించేవారు. బాల్యం నుంచే పద్యాలను, పాటలను శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులు, జావళీలు అంటే మహా ఇష్టం. ఏ కొంచెం విరామ సమయం దొరికినా కూనిరాగాలు తీసేవారు. 1952లో ఒకసారి ఢిల్లీకి స్నేహితులతో రైలులో ప్రయాణిస్తూ, ఆ రెండు రోజుల ప్రయాణంలో పాటలను, పద్యాలను రాగయుక్తంగా పాడి, తన సంగీత పాటవాన్ని ప్రదర్శించి, పీవీ అందరి ప్రశంసలూ పొందారు.
మన బృహస్పతి ఎక్కడ
పీవీ కార్వదక్షుడు. ఏ పనైనా చక్కగా అరమరికలు లేకుందా పూర్తిచేసేవారు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సరైన సలహా ఇచ్చేవారు. అందువళ్లే ఆయన అచిరకాలంలోనే మహానాయకుల సాన్నిహిత్యాన్ని పొందగలిగారు. రాజకీయ గురువైన రామానందతీర్థ, స్టేట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ పీవీ కే అప్పగించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాక, పీవీ చురుకుదనం గమనించి అప్పటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు కీలక ప్రతులు, చట్టాల రూపకల్పన బాధ్యత పీవీకి అప్పగించారు.
ఒకసారి సమావేశానీకి కాంగ్రెస్ పెద్దలందరూ హాజరయ్యారు కానీ పీవీ ఇంకా చేరుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రి బూర్జుల రామకృష్ణారావు గారు “అయ్యో! ఎక్కడ మన బృహస్పతి, ఇంకా రాలేదు?” అని అక్కడున్నవారిని అడగటం పీవీ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. కాసు బ్రహ్మానందరెడ్డిగారు ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు కూడా అన్నిరాత కోతలకు ఆయన పీవీ మీదనే ఆధారపడేవారట. ఆయన కూదా పీవీని “బ్బహస్పతి” అనే సంబోధించడం విశేషం.
(శీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా వున్నా లేకపోయినా, ఆమెకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అని కూడా చూడక పీవీ ఇంటికి వెళ్ళేవారట. ఆయనతో కూర్చుని సుదీర్ధంగా మంతనాలు జరిపేవారట. ఆమె పీవీ గారిని అంతగా నమ్మకంలోకి తీసుకున్నారు. అది కేవలం పీవీ గారి ప్రతిభను, దక్షతను మాత్రమే కాక, ఆయన విశ్వసనీయతను కూదా సూచిస్తుంది.
తెలుగు సాహిత్యం పై పీవీ గారికి అమితమైన గౌరవం. ఆయన ఒకసారి 20వ శతాబ్దపు సాహిత్యం గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ సాహిత్యంతో సరితూగగల తెలుగు సాహిత్య సంపద ఎంతో ఉందన్నారు. దీన్నీ పరిరక్షించుకోవాలన్నారు. మంచి సాహిత్యాన్ని ఎంత మాత్రం పోగొట్టుకోకూడదని, దాన్ని భద్రపర్చుకోవడంతో పాటు, ఆత్మ చెడకుండా ఇతర భాషల్లోకి తర్జుమా చేయాలి. ఏ భాషా సాహిత్వమైనా ఆ జాతి సంస్కృతి, నాగరికతకు మూలకందం. సాహిత్వానికి ఆది, అంతం అంటూ లేదు. ప్రజలకు సమాంతరంగా సాహిత్యం ఉత్పత్తి అవుతుంది. ఆయా కాలాల్లో ప్రజలు, పాలకుల అఖీష్టం మేరకు రచనలు వచ్చాయి. ప్రక్రియ సైతం ప్రజలు కోరిందే ఉంటుంది అన్నది పీవీ అభిప్రాయం.
మన దేశంలో కవిత్వం, కవితా పద్ధతులు, శైలి రకరకాలుగా ప్రవహించాయి. చిత్రకవిత్వపు పాయ మాత్రం తెలుగుకే
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020
26