పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డా॥ మండలి బుద్ధప్రసాద్‌ 9848780872

నాట్యతపస్వి శోభానాయుడు

కనువెలుగు 1956

కనుమరుగు 14-10-2020

1975లో మద్రాసులో కళాసాగర్‌ సంస్థ కూచిపూడి ఆర్ట్స్‌ అకాడెమీ వారి చండాలిక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూచిపూడి నాట్యకళ ఘన చరిత్రను ఒక మలుపు తిప్పిన ప్రదర్శన అది!.

విశ్వకవి రవీంద్రనాథ టాగూరు, బౌద్దుల కాలం నాటి ఒక ఇతివృత్తాన్ని తీసుకుని అస్పృశ్యత సమస్యపై వ్రాసిన నృత్యనాటికను ఎస్‌.వి. భుజంగరాయశర్మ గారు గొప్పగా తెలుగు చేశారు. పౌరాణిక అంశాలకు పరిమితమైన కూచిపూడి నృత్యరంగం మొదటిసారిగా ఒక సామాజిక సమస్యపై ఈ నృత్యరూపకాన్ని రూపొందించి ప్రదర్శించింది. ఆఘనత నాట్య గురువు వెంపటి చినసత్యంగారిది కాగా, చండాలిక పాత్రలో యువనర్తకీమణి శోభానాయుడు అభినయంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కూచిపూడి నాట్య విధానానికే కొత్త శోభను సమకూర్చారు.

ఆరోజు ఆమె నాట్యవిన్యాసాన్నీ చూసిన నాలుగువేలమంది అదృష్టవంతుల్లో నేనూ ఒకణ్ణి. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుగారు ఆనాటి విద్యామంత్రిగా ఆ ప్రదర్శనకు ముఖ్య అతిథి కావటంతో వారితో కలిసివెళ్లి నేను మద్రాసులో ఆ ప్రదర్శన చూడగలిగాను.

ఆ తరువాత 1976లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కూడా “చందాలిక” ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారితో సహా అనేకమంది ప్రముఖులు విచ్చేసిన ఆ సమయంలో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. ఆనాటి ప్రదర్శన ఈ నాటికీ నాకళ్లముందు కదలాడుతూనే ఉంది.

అంతకు పూర్వమే 'శీకృష్ణపారిజాతం లాంటి నృత్యనాటికలలో సత్యభామ పాత్రలో శోభానాయుడు గారు పేరొందినప్పటికీ నా దృష్టిలో చండాలిక ఒక అపూర్వమైన పాత్ర!

వెంపటి చిననత్యం గారికి పద్మభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంలో అవనిగడ్డ గాంధీక్షేతంలో వారికి మా నాన్నగారు ఘనసన్మానం చేశారు. ఆ రోజు “పద్మావతీ శ్రీనివాసం” ప్రదర్శించటానికి శోభానాయుడుగారు అవనిగడ్డ వచ్చారు. తన ప్రదర్శనతో వేలాది మంది దివిసీమ ప్రజలను మంత్రముగ్ధులను చేశారామె!

అప్పటి నుండీ ఆమెతో పరిచయం ఉన్నప్పటికీ నేను మంత్రి అయిన తరువాత శోభానాయుడిగారితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆమె కొత్త నాట్య ప్రదర్శన జరిగినప్పుడు అతిధిగా నన్ను ఆహ్వానించి గౌరవించేవారు.

కిన్నెర రఘురామ్‌ ఎక్కువగా ఆమె కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. “అతిథులుగా ఎవరిని పిలవమంటారనీ ఆమెను అడిగితే ఆమె మీ పేరునీ, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారిని పిలవమని చెప్పేవారని రఘురాం నాతో చాలాసార్లు అన్నారు.

ఆమె మోకాళ్లకు ఆపరేషను చేయించుకున్న తరువాత యిచ్చిన మొదటి ప్రదర్శన నన్నెంతో ఆశ్చర్యపరచింది. ఆమె పట్టుదలకు, కృషికి నిదర్శనమే ఆ ప్రదర్శన. 60 యేళ్ల వయసులో మోకాళ్లకు ఆపరేషను చేయించుకున్నా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగలగటం వరపుత్రులకే సాధ్యం అనుకుంటాను. "కూచిపూడి నృత్యం తన ఊపిరి, తన ప్రపంచం” అనీ సగర్వంగా ప్రకటించారామె!.

హైదరాబాదులో కూచిపూడి అకాడమీనీ ప్రారంభించినప్పుడు ఆమె 'మద్రాసులో నేను భక్తురాలిగా ఉన్నాను. హైదరాబాదులో నేను పూజారిణిని ' అన్నారట. నాట్యకళను ఒక భగవత్స్వరూపంగా

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

19