పుట:ధనాభిరామము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

ధనాభిరామము

క. అదిగాక భీమనాథుని
   వదలక కొలుచున్నవారవనితల కెల్లన్
   ముదముగఁ జీరలు సొమ్ములు
   వెదజల్లినరీతి నిచ్చె విస్మయ మొదవన్. 17

వ. అక్కడఁ గొంతతడ వుండి భీమేశ్వరునిముఖమంటపంబునకు
   నేతేర ముందర శిష్యులు గొందఱు రయంబునం జని నవనీ
   హారవాఃపూరంబులు చిలికించి మృగనాభిపంకంబున సమ్మార్జ
   నంబుచేసి కెలంకుల మణిరంగవల్లికలు దీర్చి రత్నకంబళంబులు
   పరచి హంసతూలికావిరచితంబులగు వెలిపట్టువొరగు నిలిపి,
   చిత్రాంశుకంబులు మేలుకట్లు గట్టినతత్ప్రదేశంబున కేతెంచి
   సుఖాసీనుఁడై యుండె నప్పుడు. 18

గీ. ఇతఁడె మనపాలిభీమేశుఁ డిన్ని యేల
   యనుచు వెనువెంట నేతెంచి రాదరమునఁ
   గోరి యాదేవదేవునిఁ గొలిచియున్న
   సానిరమణులు భోగముజలజముఖులు. 19

క. బాగుగఁ గడువాసించిన
   బాగాలునుఁ దెల్లగానుఁ బండినయాకుల్
   ప్రోగులుగఁ బోసి వలసిన
   లాగున వీడెములు వెట్టు లక్షలు వెలయున్. 20

వ. అప్పుడు దక్షవాటికాపురంబున గలజనంబులు మహాద్భుతా
   నందచేతస్కులై యాతని నాలోకించి. 21

సీ. నిటలాంబకముచేతి నిశితశూలము దాఁచి
             జగతి కేతెంచినశంభుఁడొక్కొ