పుట:ధనాభిరామము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ధ నా భి రా మ ము


    గోరి వెన్నెలఁ గ్రోలుచకోరములకు
    బరగఁ దక్కినరుచు లెల్లఁ బథ్యమగునె.119

వ. అని యనేక ప్రకారంబుల నొడంబఱచు బోటిమాటలకు.
   దుంటవిలుకాడు సమ్మతించి సుగుణావతియింటి కేతెంచి. 120

చ. ప్రకటితబంధసంగతులు వ్రాసినచొక్కపుమేలుకట్టులన్
    సఖియల మంచముంఖరచు చల్లనిపువ్వులపాన్పు బ్రోదిరా
    శుకములు వీణెయుం సురటి యున్న రసొంపుగగల్గి పైఁ డిజా
    లకముల మేడమీదను విలాససమున్నతి నొప్పు మెప్పుగన్.121

సీ. పాయక కమలసంభవుకూతుఁ జెఱబట్ట
         నేడ్తెఱ వెనువెంట నేగువిధము
    జంభాసురారియు సంభ్రమంబున వచ్చి
          గౌతమునిల్లాలిఁ గవయు తెఱఁగు
    తనతపోవిధి మాని ఘనపరాశరమౌని
          కణఁగి యోజనగంధిఁ గవయురీతి
    చందురుండును సురాచార్యునిసతిఁ జూచి
          యరసి మోహించినయట్టిరీతి

    నసమనయనుఁడు దారువనాంతరమునఁ
    గాంతలను భ్రమియించెడు వింతలాగు
    గోపికలఁగృష్ణుఁడలయించు క్రొయ్యదనము.
    మింట పొసపరినిండ చిత్రించినాడు.122

వ. ఇట్టిచిత్రంబుల నొప్పినఘనసారకుంకుమసంకుమదకస్తూరి
    కాగరుగంధసారమిళితపరిమళభోగంబును వివిధవిటపకుసుము
    వికసితసంవాసితంబును నగుమేలిమైనలోపల ప్రవేశించి.123