ద్వి తీ యా శ్వా స ము
43
క. కాదనక వారకామిని
గాదే యలరంభ వలచి కానలవెంటన్
బోదె నలకూబరునకున్
వాదింపఁగ నేల జగతి వలచినపనికిన్.94
ఉ. ఏటికి రత్నభూషణము లేటికి దివ్యసుగంధసంపదల్
యేటికి భామినీమణుల యిచ్చయెఱుంగని యావిటాధముల్
యేటికి నామనంబునకు నింపగువానిని దేకయుండినన్
బోటిరొ యింక ప్రాణములు పొల్పుగ నిల్వవువానిఁదేఁగదే.95
వ. అని ప్రియంబుగూర్చి వానిందెచ్చిన నీకు మెచ్చుగలదనిన
నయ్యేణలోచన పచ్చవిల్తుం డున్న యెడకు వచ్చిన సుగుణా
వతి దనలో నిట్లనియె.96
క. చనునొకొ చెలి యచ్చటికిని
ననునొకొ నామాట లెల్ల నాతనితోడన్
వినునొకొ వివరము పుట్టను
గొనకొని యలపనికి నియ్యకొనునో లేకన్. 97
ఉ. వచ్చునొ రాడో యిచ్చటికివచ్చి నిజంబుగ నన్నుఁజూచి లో
మెచ్చునొ మెచ్చడో పిదప మెచ్చిన రమ్మని కౌఁగిలించునో
యిచ్చలుమీఱ వేడుకను నిద్ధరలోపల నాకుఁ గీర్తిఁ దా
దెచ్చునొ తేఁడొకో యనుచు ధీర దలంక కలంకులోపలన్.98
వ. అని తలపోయుచుండె నంత సుగుణావతి బంపిన చెలి చని
భీమేశ్వరుని ముఖమంటపంబునకుఁ బ్రవేశించి తత్ప్రదేశం
బున నున్న కొన్ననవిల్కాని నీక్షించి యాశ్చర్యసంతోష
ప్రేమాతిశయంబులు తనమనంబునం బెనంగొన సుగుణావతి
చెప్పినమాటలు నిజంబుగా నెఱిఁగి యతని నాలోకించిన