ద్వి తీ యా శ్వా స ము
41
చేరి మాకు బుద్ధిఁ జెప్పితి విన్నాళ్లు
నిన్ను దెలుపవశమె నీరజాక్షి. 81
క. నీమనసు గలదు యేమిట
భామామణి యడుగ నీకు భయ మది యేలా
ప్రేమమునం దెచ్చి బెట్టెద
భూమండలిసఖుల నన్ను బోలంగలరే.82
వ. అని బుజ్జగించి తనపయంట చెఱంగునఁ గన్నీరుదుడిచి కురుల
నులుదీర్చి భూషణంబులు చక్కసంధించి మధురాలాపంబు
ప్రియంబునం గూర్చి యడిగిన నచ్చెలితో సుగుణావతి
యిట్లనియె. 83
ఉ. కోరికె భీమనాయకునిఁ గొల్చి వినోదముతోడ నుండగా
మారునిఁబోలునట్టిసుకుమారుఁడుమంచివయస్సువాఁడు నిం
పారఁగ నేగుదెంచిన ప్రియంబునఁజూచినయంత నుండియున్
వారిజనేత్రి వానికి నవశ్యము చిక్కితి, బెక్కు లేటికిన్. 84
ఉ. వేడుకతోడ వాని కనువిచ్చి నయం బనయంబు మీఱఁగాఁ
జూడకయున్నఁ జిత్తమున రూఢి రతీతమకంబు పుట్టగా
కూడక కూడి కోర్కులును కూరిమిమీఱఁగఁ గామవార్థి నో
లాడక యుండి లోనివిరహాగ్ని నడంపఁగవచ్చునే చెలీ. 85
క. ననుఁ జూచి వలతు రందఱు
వనితా నే వల్వ నేంతవానికి నైనన్
వినుమా యేమని చెప్పుదు
ననవిల్తుడు నాకు సాక్షి నలినదళాక్షీ.86
గీ. ఇన్ని మాటలు పనిలేద యెన్ని చూడఁ
దెలియఁజెప్పెద నిటువానిఁ దేకయున్న