ద్వి తీ యా శ్వా స ము
39
క. ఆరామామణి యంగజు
నారసి కన్నారఁ జూచినప్పటివలె నిం
డారఁగ విరహసమున్నత
భారము మేనికిని మిగిలి పరవశ యగుచున్. 73
క. గాలము మ్రింగిన మత్స్యము
పోలిక రమణీలలామ పొగులుచు మిగులం
దూలి పువుశయ్యం బొరలుచు
జాలింబడె మరుని యింద్రజాలము చేతన్ .74
సీ. కనుకలితోటెత్తెఁ గాంతాశిరోమణి
తలపోయుచుండెను దరళనయన
కాంక్షల కడు డస్సెఁ గామినీతిలకంబు
వర్ణింపఁగా వచ్చె వనజనయన
తమకించె గవయ నెంతయును గోకిలవాణి
సిగ్గు చక్కంబెట్టె జిగురుబోణి
ప్రియము రెట్టించంగ నియమించె మానిని
వలపున శోషించె వరవధూటి
యతనిధ్యానంబుఁ జేసె రాయంచమిన్న
ముదముతో తన్ను మఱచెనో మోహనాంగి
తనరి యది దశావస్థల ననుసరించి
యంగజునిఁ జూచి గుందె నాయతివ యపుడు.75
ఉ. వాడెను మోముదమ్మి తనవారల నెవ్వరిఁ దేరిచూడఁగా
నూడెను గన్నుదోయికిని నూర్పులు దట్టములయ్యె మేనికిన్
గూడెను తాపమగ్గలము గోరియు హారము నేను ధైర్యమూ
టాడెను మేను డస్సి విరహాగ్నిని గంజదళాయతాక్షికిన్.76