ద్వి తీ యా శ్వా స ము
37
పునఁ దగిలి వెతను బెట్టెను
మనసిజుఁ డను వేటకాడు మహిమ దలిర్పన్. 65
వ. అప్పుడు.66
ఉ. ఆతరుణీలలామ ప్రియమంది ముదంబునఁ జూచె సద్గుణో
పేతుని సూనశస్త్రముఖభేదనమాససమానినీవిట
వ్రాతుని సర్వలోకహితవశ్యకరోజ్వలచారురూపవి
ఖ్యాతవినిర్మలస్ఫురితకాటనకేతునిఁ జిత్తజాతునిన్. 67
క. వరసౌందర్యముఁ గల్గిన
పురుషులకును వలచు టరుదె పొలఁతుక ధరలో
మరు డిఁక గెల్చునొ యనుచును
సరి ఖేచరు లెల్ల నొక్కసంగతిఁ బల్కన్. 68
వ.అప్పుడు మన్మథుండు సుగుణావతి తనకు వశంబగుట
యెఱింగి యచ్చోటుఁ బాసి కదలి భీమేశ్వరుని ముఖమంట
పంబునఁ గూర్చుండె నంత విలాసినీజనంబులు ముదంబున
నద్దేవుని యవసరంబు దీరి తమతమమందిరంబుల కేగు మనుజ
భావంబున నున్న భావసంభవు నీక్షించి.69
చ. నలుడో శశాంకుడో దివిజనాథునికూరిమినందనుండొ కా
కలనలకూబరుండో ప్రియమారఁగమానవరూపుఁదాల్చి తా
నిలను దరించ వచ్చినరతీశుఁడొ యన్నియుఁ జెప్ప నేల మీ
చెలువము మర్త్యులందు విలసిల్లఁగ నేర్చునె బ్రహగూర్చునే.
సీ. కాంక్షించి కన్నులకరు వెల్లఁ దీర డ
గ్గరి వీనిఁ జూడనికన్ను లేల
బిగియారం గౌగిటఁ బెనగి వీనురమున
చక్కగాఁ గదియనిచన్ను లేల