పుట:ధనాభిరామము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

29

గీ. ఘనత తనయందె పుణ్యముల్ గలుగు ననుచు
   వీచికాహస్తములు సాచి వేడ్కఁ బిలుచు
   ముక్తికామినివిధమున మురియుచున్న
   సప్తగోదావరముఁ జూచె శంబరారి!28

ఉ. శ్రీవిలసిల్ల సంస్మరణఁ జేసిన యాగఫలంబు గల్గు సం
    భావన మీఱఁ జూచినను బాపము లెల్ల నడంగు నేదెసన్
    బోవక తీర్థమాడినను బొందు శుభంబులు చారుసప్తగో
    దావరిసింధుకున్ సవతు ధారుణి లేవు తలంప వాహినుల్.29

వ. అని కొనియాడుచు నాపుణ్య సింధుబంధురంబుగ
   నవగాహన మ్మొనర్చి.30

క. ధనమూలము లగుసొమ్ములు
   తనువునఁ దగఁ బెట్టుకొనిన ధనదునితో నా
   డినప్రతిన తప్పునో యని
   యని దాని దిరస్కరించె నతనుఁడు వేడ్కన్.31

సీ. లాలితబిసతంతుజాలసంధానవి
           చిత్రాంశుకంబులఁ జెలఁగఁ గట్టి
    పసిఁడివన్నెలతోటి పదనిచ్చి గలపిన
           పూదేనెగంధంబు పొసఁగ నలఁది
    తనమోహనాస్త్రసంతతి యైనచల్లని
           పరిమళమిళితపుష్పములు ముడిచి
    కామినీజనవశీకరమంత్రయుత మైన
           పూదేనెతిలకంబుఁ బొందుపఱచి