పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

29


ఈచందమున సర్వహీనమౌ నగరు
చూచి, విస్మయమును శోకంబుఁ గదురఁ
జిడిముడి వెలికివచ్చినయంతలోన,
సడికి నైరావతోచ్చైశ్శ్రవం బేఁగె
ఈవిధి సంపదలెల్ల నొండొండ
పోవుట చూచి యప్పుడు చాల నలిగి,
దహ నార్కి దనుజ యాదఃపతి గంధ
వహ యక్షపతి వృషధ్వజులును దాను
దలపోసి, తమ కాపదలు పొందినపుడు
తలఁగించుగురుని నత్తఱి బిల్వఁ బనిచి
చనుచేర నందఱుఁ జయ్యన లేచి,
పనివడి భక్తిసంభ్రమమున నెఱఁగి,
యందఱు నొక్కచో నాసీనులైన
నందుసురేంద్రుఁ డయ్యాచార్యుఁ జూచి
తారందఱును మహీస్థలికి నేఁగుటయు,
వారక యచట దుర్వాసుఁ గాంచుటయు,
నామునీంద్రుఁడు దామ మర్థి నిచ్చుటయుఁ,
దా మది గజము మస్తమున వైచుటయు,
నళులచేఁ గాసిలి యలసి యాగజము
నలిరేఁగి యాదండ నలియమోఁదుటయుఁ,
బలుమాఱు విలపింప భావింప కతఁడు
చలమునఁ గోపించి శపియించుటయును,
దివిజాగములు వేల్పుదెఱవలు కామ
గవి దివ్యమణి సురగజతురంగములు
మాయమై చనినక్రమంబును, దెలుప
నాయెడ వెఱఁగంది యాంగీరసుండు :
“విధినిర్మితంబు నేవిధమునఁ గడప

నధికులై తలపోయ నధిపు లెవ్వారు!