పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

ఆది పర్వము


దార లప్పుడువచ్చి, తమతమ మగల
కేరీతి శోకించి రిలసంచలింప  ?
బార్థులమీఁదఁ గోప ప్రసాదమ్ము
లర్థి నేగతిఁజూపె నాంబికేయుండు  ?
అనలసంస్కారాదు లఖిలవీరులకు
మనమార నెట్లు ధర్మజుం డాచరించెఁ ?
బట్టాభిషేకంబు పాండవాగ్రజుని
కెట్టివైభవముల నిలచూడనమరె ?
రసికత నిభపుర రాజవేశ్మముల
వసుధేశుఁ డెవ్వరెవ్వరి విడియించెఁ ?
జుట్టాలఁజంపినశోకంబు మాన,
నెట్టిమాటలు భీష్ముఁ డెఱిఁగించె బతికి ?
నంత సూర్యున కుత్తరాయణంబైన
శంతనసుతుఁ డెట్లు స్వర్గస్థుఁడయ్యె ?
నాయెడ ధర్మజుం డశ్వమేధమున
కేయత్న మొనరించి నిలయెల్లఁబొగడఁ ?
దమ్ములుదెచ్చినధనము లానృపున
కిమ్ముల రాసులై యెట్లువర్థిల్లె?
హరికృప జీవితుండై పరీక్షిత్తు
కరమర్థి నుత్తరాంగన కెట్లుపుట్టె ?
వెస బభ్రువాహన శ్వేతవాహనుల
కసమాన సంగ్రామమైనలాగెట్లు ?
అంత గాంధారియు, నాంబికేయుండు,
వింతగాఁ గుంతియు, విదురసంజయులు,
నాశ్రమవాసులై యరిగినపిదప,
నశ్రాంతసుఖి వ్యాసుఁ డచటికివచ్చి,
ధార్తరాష్ట్రులనెల్లఁ దనతపోమహిమ
మూర్తిమంతులఁజేసి మొగినెట్లుచూపెఁ ?