పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

ద్విపద భారతము


జూపుటయును, వారు శోకంబులుడిగి
యేపుణ్యగతులకు నేఁగిరి ప్రీతి ?
మదిరామదాంధులై మౌసలకమున
యదురాజు లొక్కటహతులౌట యెట్లు ?
అంత నారదుచేత నావార్త యెఱిఁగి,
యంతకసూనుఁ డేమనివిలపించె?
ధర నరాజకమైన ద్వారకావురికి
నరిగి, పార్థుఁడు వారి నటసంస్కరించి,
యాదవసతుల నొయ్యనఁ దెచ్చుచోట
నాదటఁ దను బోయలాక్రమించినను,
విలువంపలేక నిర్విణ్ణుఁడై యపుడు
తలకొని యందుఁ గొందఱనెట్లుగాచె?
వరశక్తిదఱిఁగిన, వైరాగ్యమహిమ
నరుఁడంత నెట్లు సన్యాసంబు గొనియె?
కర్ణుండొకట నరక ప్రాప్తుఁడయ్యుఁ
బూర్ణ భోగస్వర్గమున కెట్లువోయెఁ ?
గర్మ విపాకంబు కాలునిచేత
ధర్మజుం డేరీతిఁ దప్పకవినియె ?
నమరలోకంబునకరిగి, పాండవులు
తమపూర్వతనువులు దాల్చుట యెట్లు ?
అనఘాత్మ, మాకు మహాభారతంబు
విన వేడ్కయయ్యెడు ; వివరింపవయ్య !
ఆదిపురాణ శాస్త్రార్థ రహస్య
వేదివి; నీకంటె విజ్ఞాని లేఁడు.
ఒనరంగఁ జెప్పవే ! యుగ్రశ్రవుండ,
జననంబు మాకెల్ల సఫలత నొంద. "
ననుచువాక్రుచ్చిన, నమ్మహాత్మకుఁడు
వినయముతో వారి వీక్షించిపలికె: