పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

5


ఆమహాగినని దప్పి యు మై... బోయి ,
సామెట్లు కర్ణుని బాణమై నిలిచె ?
నలమి పార్థుఁడు గావ నయ్యగ్ని శిఖలు
వెలువడి, సభ యెట్లు విరచించె మయుఁడు ?
ఆకొల్యులోపల యమసూతితోడఁ
బ్రాకటలీల నారదుఁ డేమి చెప్పె !
రాజసూయాధ్వర ప్రారంభ వేళ
నాజరాసంధుని హరి యేమిచేసె ?
శౌరికి నగ్రపూజలు చేయనీక
యేరీతి శిశుపాలుఁ డీల్గె గర్వమునఁ :
గొలువులోనికివచ్చు కురురాజుఁ జూచి,
యెలనవ్వుగా భీముఁ డేటికిన వ్వె ?
ద్యూతంబు తల పెట్టి, దుర్యోధనుడు
ఏ తెఱంగునగెల్చె నెల్ల, పాండవుల !
ద్రౌపదిఁ దొడలమీదకు రమ్మటంచు
బాపాత్ము డెట్లాడెఁ బతులసన్నిధిని  ?
అతివఁదోడ్కొని యుంత నడవి కేఁగుచును
బ్రతిన లేమేమని పట్టిరి వారు ?
అమ్మహావనములో ననిలజు చేతఁ
గిమ్మీరుఁ డేరీతిఁ గెడసెఁ బోరాడి ?
హరియును ద్రుపదుండు నంతఁ బాండవుల
నరయుదమని పోయి యచట నేమనిరి?
పాశుపతాస్త్రంబుఁ బడయంగఁ గోరి,
యీశానుతోఁ గ్రీడి యెట్లు పోరాడె?
నాతఁడా పాశుపతాస్త్రంబుఁ బడసి
యే తెఱంగునఁ బోయె నింద్రునిఁ జూడ ?
రోమశువలనఁ బార్థునిసేమ మెఱిఁగి
యేమి తీర్థములాడే నిట ధర్మరాజు