పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

478

ద్విపద భారతము


శరణాగతత్రాణచరితుండ వంచు .
శరణంటిఁ; గావవే చక్రిసహాయ!
ద్రుపదబంధనలోల, ద్రోణసంస్తుత్య,
కపటఖేచరయంత్ర ఖండనోద్దండ
రణరంగభీకర, రాధేయవిజయ ,
ప్రణవకోవిద, దివ్యబాణప్రవీణ,
శ్వేతవాహన, బాహువిహితగాండీవ,
నాత.......గొరయగు ననుఁగావుమనిన
మయునిఁ బోనిమ్మని మంటకుఁ జెప్పి,
ప్రియముతో రక్షించె బీభత్సుఁ డతని.
లావుకపిట్టయై లావుకియందు
బావుగా మును మందపాలుండు గనిన
మొలకఱెక్కలఁ బచ్చిముక్కులతోడ
నలువురుకొడుకులు నాగేంద్రుఁడొకఁడు
మయుఁడును దప్ప, నమ్మంటలో భస్మ
మయమయ్యె జంతుసామగ్రితో వనము.
ఆరీతి ఖాండవం బాహుతిఁగొనిన,
నారోగ్యమును బొంది యనలుఁ డుప్పొంగి
నారాయణునిఁ జూచి నవభక్తియుక్తి
గారవం బేర్పడఁ గదిసి యిట్లనియె:
"కమలాక్ష, యీవును ఘనుఁ డర్జునుండు
నమితవైభవశక్తి నలరి యిచ్చోట
దేవేంద్రుతోఁ బోరి దివ్యబాణముల
వావిరి నవ్వేల్పు వదలంగఁ దోలి,
నాకోర్కి గావించి నలువొప్ప జయము
చేకొంటి; రిదిచూడఁ జిత్రంబుగాదు!
నరసహాయుండవై నవ్యతేజమున
ధరణిభారంబెల్లఁ దగమాన్పఁబూని