పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

479


సప్రతాపుండవై జనియించు నీకు
నీప్రయోజనమెంత యెన్ని చూడఁగను!
నీప్రభావముఁ గాననేరఁడు బ్రహ్మ;
నీప్రభావముఁ గాననేర్తునె యేను!"
అనుచు వైశ్వానరుఁ డావాసుదేవుఁ
గొనియాడి, వేడ్కతోఁ గొమరొప్ప గ్రీడి
దీవించిపోయిన, దివిజులు మెచ్చ
నా వేళఁ గృష్ణుండు హర్షింపుచుండె.

శివుఁడు ప్రత్యక్షమై కృష్ణార్జునులఁ బ్రశంసించుట


అంత మహాదేవుఁ డధికసంతోష
మెంతయు దైవాఱ నింపుసొంపలర
నందికేశ్వర భృంగినాథ విఘ్నేశు
లందంద షణ్ముఖులాదిగాఁ గలుగు
ప్రమధగణంబులు బలిసి సేవింప,
నమితవైఖరితోడ నష్టభైరవులు
హరి వహ్ని యమ దానవాంబుప వాయు
నరవాహనాదు లున్నతభక్తి గొలువ,
సురముని కిన్నరాసుర సిద్ధ సాధ్య
గరు డాప్సరో యక్ష గంధర్వవరులు
వరుసతోఁ జేరి కైవారముల్ సేయఁ,
బరమమునీంద్రులు ప్రణుతిగావింపఁ,
దుంబుర నాంద స్తుతిగీతకళలు
పంబినప్రీతితోఁ బరిపాటి వినుచు
సకలవాద్యధ్వనుల్ చదలఁబర్వంగఁ
బ్రకటమై జయజయభాషలు చెలఁగఁ,
బరమానురాగసంపద నేఁగుదెంచి
హరి ఫల్గుణుల యగ్రమందొప్పనిలువ,