పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

403


అర్జునుఁడు ద్రౌపదినిఁ దల్లికి నివేదించుట



గొమరొప్పనిలిచి: "యోకుంతి! ముదంబు
లూరఁగ నటపోయి యొకభిక్ష దెచ్చి
నారమిచ్చటి;" కన్న నాతి: వేవేగఁ
గొదలేక భిక్షు యేగురుఁ బంచుకొనుఁడు
మొదలనెట్లట్ల,”ని మునుముట్ట నాడి
వెలుపలకేతెంచి వీక్షించునపుడు,
నెలకొన్న పండువెన్నెలసోగవోలెఁ
బూని వర్షమువెంట భువిడిగ్గి మరలఁ
గా నేరకున్న తొల్కరిమెఱుఁగువోలె
దూరఁ జెందొవరేకుదొనఁ జోటులేక
జారిన పంచాస్త్రుశరమును బోలెఁ,
జెదరక శుక్రుసంజీవనివలన
బ్రదికిన బంగారుప్రతిమయుఁబోలె
నభినవశ్యామాంగి యలినీలవేణి
త్రిభువనలక్ష్మి యత్తెఱవయుండంగ,
వీక్షించి యానందవివశయైకుంతి :
"ఈక్షితిఁ గంటినే యిటువంటికొత్త!
ఇందుఁజూచి కఱంగు నిందుకాంతముల
పొందునఁ గన్నులీపొలఁతినెమ్మోముఁ
గనుఁగొని హర్షాశ్రుకణములు విడిచె;
వినక కానక యేల వీరినిట్లంటి!
నెప్పుడు నన్నట్టులే వీరినంటి;
నిప్పువ్వుఁబోఁడి చొప్పెఱుఁగలేనైతిఁ ;
జయ్యన మీదువిచారించి కాని,
యెయ్యెడఁ బలుకుట యిదికార్యహాని.
తనయులురారని తలఁకుచునుండి
మనముచలించి యామాటలాడితిని.