పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

ద్విపద భారతము


ఏవుర కొకయింతి యిదియు నక్రమము!
నావాక్యమునుదప్పి నడవ రెన్నడును;
ధర్మమేగతినుండెఁ దలకూర్తు" ననగ
ధర్మరాజంత నంతయు వినివచ్చి,
తమ్ములుఁ దానును దల్లికి మ్రొక్కి,
తమ్ములఁ జూచి యా ద్రౌపదిఁ జూచి,
హరినూతినిట్లను: "నర్జున, నీవు
వరియింతుగాక యీవామాయతాక్షిఁ,
జాపచాతురిఁగాదె చనుదెంచె!” ననఁగ,
నాపుణ్యుం: “డిట్లేలయానతిచ్చెదవు!
అన్నవునీవుండ నర్హమా! నాకుఁ
గన్నియ మున్నాడికైకొన దేవ !
మీరు వరింపుఁ డీమృగరాజమధ్య;
నేరూపమున మాకు నిదిమనోహరము.
............................................
అనుఁగాక యేమి, మృగాక్షి యేవురకు
మనమున నభిలాషమగ్నయైయుండు.”
............................................
నావిధంబంతయు యమసూతి యెఱిఁగి,
దేవేంద్రసుతుఁజూచి తేటనవ్వమర :
"నేవురు వరియింత మీ పువ్వుఁబోఁడి;
నేవెంట గురువాక్య మేటికిఁదప్ప!
కుంతి 'యేగురుఁబంచుకొనుఁ' డన్న మాట
యెంతయుఁబాటింత మిది దాటరాదు.
భావింప నిదిధర్మపథముగాకున్న
నేవురకును బ్రేమ యిందేలమొలచు?
వ్యాసమహాముని వాక్యంబు లెల్ల
మోసమే! మనకుధౌమ్యుఁడుఁ జెప్పెనిట్లు."