పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

399


విడిపించుకొని భీమువ్రేయుచో, నతఁడుఁ
గడిమినాతనిలావు గైకొని తెలిసి
తానట్లు వ్రేయ నాతండుమూర్ఛిల్లె.
జానొప్ప వేవేగ శల్యుండు గదిసి
మల్లయుద్ధమునకు మఱి తొడఁబడినఁ,
బెల్లార్చి భీముండు పృథివిపై కొంత
సదవుచ్చుకొని రెండుసగములుచేసి,
వదలక యవిరెండు వంకలఁజిమ్మి,
కనుమోసమునఁజొచ్చి కచ్చయు మెడయుఁ
బెనఁగొన నిరుగేల బిగియంగఁబట్టి,
కాలుకాలగ్రహించుగతిఁ జూచి, శల్యుఁ
డాలోనఁ గడు భీము నడఁగఁబట్టుటయు,
మంచుననిలువని మార్తాండు పగిదిఁ
బొంచినబంధనంబులు ద్రెవ్వ నిలిచి,
ననిలునాత్మఁదలంచి యనిలనందనుఁడు
ఘనశక్తి నిరుగేలఁ గబళించి యెత్తి,
మలయవైచినయట్లు మహిఁద్రెళ్ల వైవఁ
గలకల నవ్విరి కన్నవారెల్ల.

అర్జునుఁడు కర్ణు నోడించుట



కానీనుఁ డట పార్థుఁగట్టల్కఁదాఁకి
నానాస్త్రములు మేననాటి యార్చుటయు,
సింహంబునకుఁ బ్రతిసింహ మన్యోన్య
సంహారమతిఁ దోచుచందంబు దోచె.
ఆవేళఁ జూచుసైన్యము లిరువురను
భావించు తమలోనఁ బలుకుదురిట్లు,
"ఈతండు నీతండు నేమౌదురొక్కొ!
చాతుర్యరేఖల, సరివచ్చినారు;