పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

ద్విపద భారతము


కావున, నిచ్చోటుకదలించి వారి
వేవేగ ననుపవే! వేఱొక్క యెడకు.”
అనిన నందనుతోడ నాతఁడిట్లనియె:
“తనయ, ధర్మజుఁ డట్టితలఁపులవాఁడె!
ఏజాడ నీ రాజ్యమేలఁ; డేలినను,
రాజు తానగుఁగాని, రాజు నిన్ జేయు.
పాండుండు రాజుగాఁ బాటించెనన్ను;
బాండునూనుఁడు నిన్ను బాటింపకున్నె!
వదలి యేనొకవంక వారిఁబొమ్మనిన
విదురుండు పోనీఁడు వేయేల!" యనినఁ,
గౌరవుండిట్లను : "ఘనరోషవిషము
వారిమాసందున వర్ధిల్లు నెపుడు;
నీవు పాండుఁడు నుండునెయ్యంబుగాదు;
గావున వెడలింపఁ గాదన రొరులు,
వదలఁడు నన్ను నశ్వత్థామ హితుఁడు;
తుదముట్ట విడువఁడు ద్రోణుఁడాసుతుని;
నయ్యిరువుర వాఁడు నగుఁ గృపాచార్యుఁ;
డియ్యెడ విదురున కేలావుగలదు!
ఏకభావుఁడు భీష్ముఁ డిందును నందు;
నేకార్య మనువుగా దీలోన మనకు.
కలదు గంగాతీరకాననాంతమున
వలనొప్ప వారణావతమనుపురము;
ఈశ్వరస్థాన మనేకభోగైక
శాశ్వతం బచ్చోట సౌఖ్యంబు గలదు;
గడిరాజ్యమది శత్రుగణము రాయిడికి
నెడరైనచో వీరినిడుము మే."లనిన
నొడఁబడి, యాంబికేయుఁడు పాపములకు
నొడిగట్టుకొని, వారినొక్కనాఁ డంతఁ