పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

ద్విపద భారతము


సకలధర్మంబులు సరవితో వ్రాసి
యొకవంక నిడి, సత్య మొకవంకఁ బెట్టి
త్రాసునఁ దూఁచిన, ధర్మంబుకంటె
వాసియయ్యెను సత్యవచనంబుతొల్లి
కావున, సత్యంబు గడచిపోనాడు
భూవిభుగావించుపుణ్యంబులెల్ల
నొనర బూడిదలోనిహోమంబుగాదె!
మనుజేశ, కల్లలు మానుము నీవు”.
అనిన, మానినిఁజూచి యవనీశుడనియె:
"వినరాని మాటలు వెలఁది, యాడెదవు;
నలి నసత్యముగాఁగ నామాటలెల్ల,
వెలఁది, నీమాటలు వేదంబొ చెపుమ!
మటుమాయప్రోగులు, మదనమోహినులు,
నటమటంబులఠావు, లనృతభాషిణులు,
కన్నుండఁ గనుపాపఁ గడఁకతోఁదివియు
కన్నగాండ్రులుగారె ! కాంతలన్వారు.
సత్యంబులెల్ల నసత్యంబు సేయ,
నిత్యమనిత్యంబు నిజముగాఁ జేయ
నేరుపు సంధిల్లు నెలఁతల కెల్ల;
సారెకు నీమాట చాలించి యరుగు".
మనిన, శోకంబుతో నతివయిట్లనియె:
"వనములోపలనుండు వనితాజనంబు
పలుకుల సత్యంబు పాటిగాదయ్యెఁ!
గలకాలమును శత్త్రుగణములఁజెఱుచు
కుచ్చితంబులునేర్చు కువలయాధిపులు
నచ్చుగా సత్యంబులాడెడువారె!
నామోముచూడుఁడి నలినలియయ్యె!
నేమింక నేమననేర్తుము నిన్ను