పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

51


ననుకాంతపలుకుల కమరులుఁ బుణ్య
జనులును బంతులై సాఁగికూర్చుండ,
నమరేంద్రుఁ డాదిగా నమరదిక్పాల
సమితికి, సకలనిర్జరసంఘములకుఁ,
గడఁగి కుత్తుకబంటిగాఁగ నయ్యమృత
మెడపక యెంతయు నిడుచు నేతేరఁ,
గని రాహువనువాఁడు గ్రక్కున సము
తనుయుక్తుఁడై దేవతాకోటిలోన
ననువారఁ గూర్చుండి యమృతంబుఁ ద్రావఁ,
గని, సుధాకరుఁడును గమలమిత్రుఁడును
దానవారాతికిఁ దద్విధంబెల్లఁ
బూనిచెప్పుటయు, నప్పురుషోత్తముండు
గనుఁగొని సుధ కుత్తుకకుఁ బోకమున్న
తనచక్రమున రాహుతలఁ ద్రుంచివైచె .
సొలవక యమృతంబు సోఁకుటఁ జేసి
తల వృద్ధిపొంది తత్తను వుర్విఁ బడియె.
అది యాదిగా, రాహు వర్కేందువులకు
వదలక శత్రువై వర్తించుచుండె.
అసురులు తమచేతియమృత మీభంగి
విసువక విష్ణుండు విబుధుల కిడిన,
నలుక దీపింపంగ నతికోపు లగుచు
బలియులై బలిముఖ్యబహుదైత్యపతులు :
“ఓసురలార, మ మ్ముఱక రప్పించి
బాస దప్పఁగ మీకుఁ బాడియె తలఁప!
నన్నియు లెస్సాయె! నందు కేమాయె!
బన్నుగా మావంక పాపంబు లేదు.
బీరంబుగా నాజిఁ బ్రీతిఁ గాలూఁది

పోరాడుఁ; డిట్టట్టు పోనీయ మింక.