పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

ద్విపద భారతము


నలజడిఁ జనుదెంచునతనిరూపంబు
వెలయంగ దవ్వున విభుఁడు వీక్షించి
ప్రజలకు నతని సౌభాగ్యంబుఁ జూపి
నిజ మైనప్రేమంబు నెఱయ నిట్లనియె:
"ఈవచ్చు చున్న వాఁ డెవ్వఁడో? వీని
భావంబు నిపు డేను భావించినాఁడ,
అరుదార నశ్వవిద్యాభిజ్ఞుఁ డౌట
సొరిది గుఱ్ఱముఁ జూచుచూడ్కి చెప్పెడిని,
అతిఘోరసమరసాహసుఁడు గా నోపు,
ఇతనిచందమును నాయితముఁ దెల్చెడిని.
ఎఱుఁగుదురేని నా కెఱిఁగింపుఁ డితని;
ఎఱుఁగ కుండిన మీర లెఱిఁగి రావలయు."
అను చుండ నృపుఁ జేర నరిగి పాండవుఁడు
మునుకొని కే లెత్తి మ్రొక్కి యిట్లనియె:
"దేవ న న్ని పు డేలు, తెఱఁ గొప్ప నిన్ను
సేవింతు హయముల శిక్షించుపనికి.
అనఘ దామగ్రంధి యను పేరు గలిగి
విను ధర్మజునియింట విహరింతు నేను.
బలయుతమ్ములలోనివానిఁగా నన్ను
నిల వేఱు సేయక యేలే నావిభుఁడు.