పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

29



బలిసి యచ్చట నొక్క పసరంబు చచ్చి
యిలమీఁదఁ బడి యుంట నీక్షించి యీడ్చి
దానితో లొలిపించి తమకైదువులకు
వానకు మాటుగా వరుసఁ జుట్టించి
మఱియు నచ్చట నొక్క మనుజునిబొంది
యరసి నిస్సార మై యది యున్నఁ జూచి,
ఇది యుంఛవృత్తిచే ని ట్లయ్యె ననుచుఁ
గదిసి కైదువులతోఁ గట్టించె నదియు.
ఇత్తెఱంగున జమ్మి నెల్లకైదువులు
మొత్తంబుగాఁ బెట్టి మోదించి నృపులు
తోర మైపర్వు నీదుర్గంధ మెవరుఁ
జేరరు పొ మ్మంచుఁ జిఱునవ్వు నగుచు
నచ్చోటుఁ బాసి తా రామత్స్యపురికి
వచ్చుచో నప్పు డవ్వసుధేశుఁ డనియె:
"ఒరు లెఱుంగక యుండ నొక్కొక్క పేరు
ధరియింతు మది మీరు తగవుగా వినుఁడు.
అరుదార జయుఁడు జయంతుండునువిజయుఁ
డరయ జయత్సేనుఁ డలజయోద్బలుఁడు,
మఱవక మనలోన మనము పిల్చుటకుఁ
దెఱఁ గొప్ప నివి నామధేయంబు లిపుడు"