పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


అని చెప్పికొని పోయి యట వేడ్కతోడఁ
దనరారఁ గాళిందితటిఁ జేరి నృపులు,
అందుఁ దీర్థము లాడి యట సేద దేఱి
యందఱు సుఖ మున్న యవసరంబునను,
పదిలంపునిష్ఠతోఁ బాండవాగ్రజుఁడు
ముద మొప్పఁ దూరుపు మొగముగా నిలిచి
కరములు మొగిచి యాకాశంబుఁ జూచి
పరఁగ నంతకు నిట్లు ప్రార్థించి పలికె:
"ధర్మ దేవత, నాకు దయ నొక్కవరము
నిర్మించి తది నేఁడు నెమ్మి నీ వలయు.
అది నమ్మి దుర్యోధనాదివైరులకు
నొదుఁగక వర్తింతు నుర్వి నీయేఁడు.
నాఁడు నాతమ్ములు నడుకానఁ బడినఁ
బోఁడిగా బ్రదికించి పొడచూపి నీవు
మాకు బుద్ధులు చెప్పి మము నూఱడించి
మాకు నిచ్చినయీవి మఱవంగ లేము "
అని తారు విప్రుని యరణి దేఁ బోయి
ఘనత నొందినమేలు గాన రా నాడి,
ఏ పార మోడ్చిన యిరుగేలు నొసల
దాపించునంతలో ధర్మరాజునకుఁ