పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


ధౌమ్యుండు నగ్ని హోత్రములు దెప్పించి
కామ్యపూజలు చేసి గమనమంత్రములు
జపము సేయుచు నున్న సమయంబునందు
నృపతు లేవురు లేచి నెలఁతయుఁ దారు
నసలార నతనికి నగ్ని దేవునకు
వెసఁ బ్రదక్షిణముగా వేడ్కతో వచ్చి
సుముహూర్త మనిపించుశుభనిమిత్తములు
క్రమముతోఁ జూచుచుఁ గదలి రందఱును.

విరాటనగరంబునకుఁ బోవఁ బాండవులు వెడలుట.

అప్పుడు ధౌమ్యుండు నరుదేర నృపులు
తప్పక కాళిందితటమును వెడలి,
మిగులుపాంచాలభూమికి దక్షిణముగ
మొగి శూరసేనభూములలోనఁ జొచ్చి,
పడమటిముఖముగాఁ బ్రతివాసరంబు
నడచి పోవుచు నెట్టి నగరంబుఁ జొరక,
అడవిలోఁ గూరలాహారంబు చేసి,
తడయక బహువినోదములు చూచుచును,
పొలు పారుచల్లనిపొదరిండ్లఁ జూచి,
చెలంగి యం తంతటఁ జేరి నిల్చుచును,