పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తిరుమలదేశికు, డతనికి
తిరువేంగళనాథ నామధేయుఁడు వెలసెన్.

47


వ.

అమ్మహామహుని మహనీయప్రభావంబు వివరించెద.

48


సీ.

కమనీయమై యొప్పుకలిమికి రారాజు
             గాంభీర్యగరిమకు కంధిరాజు
రూపసౌందర్యాదిరూఢికి రతిరాజు
             కడుధైర్యలక్ష్మికి గట్లరాజు
ఘనతరసత్కాంతికళలకు ద్విజరాజు
             తథ్యవాక్యములకు ధర్మరాజు
విరివిగ సద్యోగవితతికి సురరాజు
             ఘనభాగ్యగరిమకు కమలరాజు
పరమద్రావిడయాసూరివంశరాజు
గురుతరం బైన మౌద్గల్యగోత్రరాజు
చతురమఱిగంటి వేంగళాచార్యరాజు
రాజరాజాధి దేశిక రాజరాజు.

49


ఉ.

దాపున నాయనంతగిరి, ధర్మపురీస్థలి, యూరుగొండ, గం
గాపురి, బ్రహ్మరాయపురి, కర్పర, రేబలె, యండబెట్ల, బా
చేపలి యాదియైన హరితీర్థములన్ గురురాయపట్టణ
స్థాపకుఁ డై జెలంగె బుధసమ్మతి వెంగళనాథుఁ డెంతయున్.

50


గీ.

అట్టి వేంగళగురునియర్ధాంగలక్ష్మి
వరదయాగుణనికురుంబ వరదమాంబ
సిరుల సౌందర్యవిద్యావిశేషకళల
బలియు లైనట్టి యష్టపుత్రులను గనియె.

51


సీ.

మత్తేభనరహయమనుజేంద్రమకుటాగ్ర
             మిళితాంఘ్రియుగళుఁ డప్పలగురుండు
నిగమచేతస్తంత్రనిపుణార్ధసంపత్తి
             నతిశయిల్లెడు వేంకటార్యమౌళి