పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నగరికడ నిల్చి యాయజనందనజటి
యాదిధరణీఖగచ్చట లంది కనిన.

274


మ.

కరకంజాలనె రెంటినంటిలఁగ జక్కంజాలి యల్కస్థితిన్
నెరయం జేరిచి నిల్చినంగని యెదల్ నిండార హర్షస్థితిన్
సరగన్నందరలీయ నాశిషల హెచ్చంగాంచి హర్షాసనా
లడయం జేర్చిన నెంతయే నలరి యయ్యాసీనత న్నిల్చినన్.

275


క.

ఆజటినేతల యానతి
రాజకళలఁ చెందినట్టి రాజశశియటన్
రాజిసగతి గద్దియకడం
దేజితసంస్థాని యయ్యె దిగ్గన నంతన్.

276


తే.

కైకనందనరా నేలగదిసి చరణ
కంజరక్షలఁ దలదాల్చి కడన నిల్చి
యన్న! నీయాజ్ఞ నాశిరస్సందె దాల్చి
నేర్చిన ట్లధినేతనై నిలిచినాడ.

277


ఆ.

రాజనీతిచేత రాష్ట్రజనాళికి
శ్రీ లెసంగ రక్షఁ జేసినాఁడ
నిట్టి చరణరక్ష లిన్నిదినాల్దాక
గద్దెయందె జేర్చి కడనలిచ్చి.

278


ఉ.

రాజశశాంక నీచరణరక్షల హృత్స్థలి దాల్చి దండినై
రాజితరాష్ట్రసంస్థలి నరాతిజనాళికి దేరికాంచనెం
తే జడియంగ నాజ్ఞ జగతీస్థలిఁ జల్లఁగ నింతదాక నే
నీజనరకు దాలిచితి నిల్చెద నీకడ దాససంతతిన్.

279


సీ.

కలశజజటిగాక కంధినీ రరగించి
             తక్కిన ఋషితతి ద్రాగఁగలరె!
హరకంఠసంస్థితహాలాహలక్రియ
             దైత్యఖగచ్చటల్ దాల్చఁగలరె!