పుట:దశకుమారచరిత్రము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

దశకుమారచరిత్రము

     యించి తలవరు లట్లనం దగుట తెలిసి యమ్మాణిక్యంబు
     పాఱున కిచ్చి పడినపాటును మదీయజన్మాభిధానంబులును
     భవదీయాన్వేషణార్థంబు పర్యటనప్రకారంబును సముచి
     తోక్తుల సూచించి తెలుపుకొని చెలిమి చేసి యాదివసంబు
     గడపి నిశాసమయంబున.19
తే. సాంద్రతిమిరంబు చూచి యశంక వారి
     చరణబంధనకీలముల్ వెరవు లావు
     వెలయఁ దునిమి మదీయశృంఖలయు [1]విడిచి
     యేను వారును వాకిటి కేఁగి యచట.20
క. రక్షకులు నిద్రవోవుట
     వీక్షించి తదాయుధములు వెసఁ గైకొని యే
     మాక్షణమున వెలువడి పుర
     రక్షకతతిఁ గాంచి పటుపరాక్రమలీలన్.21
చ. కనుకని తూలఁ దోలి బలగర్వమునం దలపడ్డవారలన్
     దునియలు సేసి యొండొరుల దోర్బలసంపద చెప్పికొంచు బో
     రనఁ గటకంబు వెల్వడి నృపాత్మజువేలము చొచ్చి మంత్రినం
     దనుఁడగు మానపాలు నుచితంబుగఁ గాంచి యనాకులస్థితిన్.22
వ. మా తెఱం గెల్ల నెఱింగించుచున్నయెడ నతండు నా కులం
     బునుం బేరునుం బూర్వవృత్తాంతంబును నప్పటిబలపరా
     క్రమంబులును నిజభృత్యులవలన విని సన్మానపూర్వకంబుగా
     నన్నుం గైకొనియె మఱునాఁడు మత్తకాళుండు స్వజనంబులం
     బుత్తెంచినం గొందఱు వచ్చి మానపాలుం గని యి ట్లనిరి.23

  1. విఱిచి